Friday 30 November 2018

In Telangana, Muslim Voters Stand Divided but Appear to Favour TRS

In Telangana, Muslim Voters Stand Divided but Appear to Favour TRS 

https://thewire.in/politics/telangana-assembly-polls-muslims-voters-divided-trs-kcr


The Muslim vote will play a crucial role in deciding who wins the upcoming assembly election, which is why both TRS and the grand alliance (Congress, TDP and others) are trying their level best to woo the community.


Mahtab Alam

29/NOV/2018
Hyderabad: Unlike the last assembly elections, where there was absolute clarity on who to vote for, this time around the relatives of Abdul Taha stand divided over whom to vote in the upcoming assembly elections.

“While half of my extended family is likely to vote for the Congress-Telugu Desam Party alliance, the other half thinks it is better to support the Telangana Rashtra Samithi which has done some good work for Muslims,” said Dr. Taha, an assistant professor at Centre for the Study of Social Exclusion and Inclusive Policy, Maulana Azad National Urdu University (MANUU), Hyderabad. Taha is from Suryapet district and his relatives live in Muslim-concentrated districts like Mehboobnagar, Nalgongda and Khammam. 

“Those in favour of TRS cite schemes like Shaadi Mubarak, minority schools, overseas scholarships and budget for minorities” explained Taha. “However, those who are in favour of the Congress-TDP alliance, believe that KCR is just making a fool of Muslims by delivering speeches in flowery Urdu. Moreover, there is also a fear that TRS might once again join hands with BJP,” he added.

According to Taha, the situation his relatives are currently in more or less represents the mood of Muslims across the state. 

Also read: Star Campaigners, Communal Messaging Unlikely to Brighten BJP’s Prospects in Telangana

Telugu writer and activist Yusuf Baba, better known as ‘Sky Baba’ echoed Taha’s observations. “Muslims are both happy and angry with KCR,” said Baba, a native of Nalgonda. “Happy because he built English medium residential schools for Muslims, started the Shaadi Mubarak scheme and because one of his deputy chief ministers is a Muslim,” Baba told The Wire. “At the same time, Muslims are suspicious of KCR because of his proximity with BJP and Modi in the recent past,” he added. 

Apart from KCR’s proximity to BJP, people are also vary of the claims made in the name of work done for the welfare of minorities.

“There is a huge difference between what KCR claims and the reality,” said Amjedullah Khan, spokesperson of Majis Bachao Tahreek (MBT), a local political party. Pointing out the gaps in the budget earmarked for minorities welfare and the actual amount spent over three years, he claimed that “not even half of the earmarked amount was spent last year”. 


Congress Telangana president N. Uttam Kumar Reddy, BJP chief K. Laxman and MIM’s leader Akbaruddin Owaisi are all facing criminal charges.

“Only 41.19% of earmarked budget was spent last year,” he said. “The year before was even worse, just 27.89%. And this year, according the latest available data, only 29.24% of earmarked budget has been spent.”

Taha had to make almost a similar point about the minority budget. “Another important point about the minority budget is that not more than 60% of the amount earmarked has been released in the last three years,” said the the Majlis Bachao Tehreek leader. 

It should be noted that as far as Shaadi Mubarak scheme is concerned, it is not Muslim specific. The scheme is for women above the age of 18. Amongst non-Muslims, it is known and promoted as Kalyana Lakshmi. The scheme was launched in October 2014 for SC/STs and minorities, but was later extended to one and all. 

The Muslim vote will play a crucial role in deciding who wins the upcoming assembly election. Muslims constitute 12.7% of the total population in the state. From a total of 119 constituencies, the community plays a decisive role on nearly 30 seats. The importance of Muslim votes also becomes evident from how both TRS as well as the grand alliance (Congress, TDP and others) are trying hard to woo Muslim voters.

Also read: As Congress Seizes the Moment in Telangana, Sonia and Rahul Gandhi Appear Confident

According Fasihullah Shaikh, editor of Hyderabad Youth Mirror, Muslims of the state can be broadly divided into two categories, rural and urban. “Rural Muslims have been traditional Congress voter and seeing new energy in Congress they are likely to once again vote for Congress,” Shaikh told The Wire. “As far as urban Muslims are concerned majority of them live in and  around Hyderabad and likely to be intact with AIMIM, hence in support of of TRS.”

Like Taha and Baba, Shaikh also maintained that as of now Muslim voters stand divided. Notwithstanding, these observations many believe, TRS is likely to be preferred by majority of Muslims. Part of the reason of their conviction is based on AIMIM’s full support to the ruling TRS. 


Rahul and Sonia Gandhi with alliance leaders at the rally on the outskirts of Telangana. Credit: PTI

The Asaduddin Owaisi led All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) is supporting TRS with full force. “I am convinced that K. Chandrasekhar Rao will be the next chief minister,” Owaisi declared recently. The party can directly influence voters in more than 20 constituencies, of which seven it has been winning in last two elections. In 2014, the party contested on 20 seats and performed reasonably well. However, this time it is only contesting eight seats even though the party had initially filed nominations for 21. 

According to a report in LiveMint, “The decision is part of its tactical understanding with caretaker chief minister K. Chandrashekar Rao’s Telangana Rashtra Samithi (TRS), and could give Rao an edge in seats with sizable Muslim voters.” Apart from AIMIM, Jamaat-e-Islami Hind, an influential politico-religious organisation with substantial support base across Telangana has lent its support to TRS. 

Also read: KCR’s Empty Promises on Jobs May Cost Him in Telangana

Moreover, there seem to be a preference for KCR among Muslim government employees. “It is a compulsion for Muslims to ,vote for TRS this time because the Congress is not in a position to form the government,” said a government employee on the condition of anonymity. “KCR might not have done enough for Muslims but after Y.S. Rajasekhara Reddy he is seen as a Muslim friendly leader,” he said. Another Muslim government employee expressed a similar stand.          

Meanwhile, last week, a number ‘Muslim intellectuals’ met Rajya Sabha MP Ahmed Patel, who is also Sonia Gandhi’s political advisor, during his visit to the capital city and promised their support to the grand alliance in order to defeat the TRS in Telangana.

But according to a senior journalist, who requested anonymity, the meeting is unlikely to have much influence following as far as electoral politics is concerned. “They are good for drawing room discussions and hall meetings but can’t influence the voters. They themselves know it very well,” the senior journalist said.  

Thursday 29 November 2018

Wednesday 28 November 2018

Chandrababu Naidu Speech at Khammam Public Meeting

ఖమ్మం గడ్డపై కెసిఆర్ దుమ్ముదులిపెసిన చంద్రబాబు | Chandrababu Naidu Speech at Khammam Public Meeting


https://www.youtube.com/watch?v=IOJklaSCLkI

అయోధ్య రామమందిరం కేసు - మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?

అయోధ్య రామమందిరం కేసు - మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?

సుప్రీం కోర్టులో అయోధ్య రామమందిరం కేసు విచారణ వాయిదా: మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?
29 అక్టోబర్ 2018
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ షేర్ చేయండి
Image copyrightGETTY IMAGES
రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను జనవరికి వాయిదా వేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కొత్తగా ఏర్పాటైన ముగ్గురు జడ్జిల ధర్మాసనం విచారించింది.

అంతకు ముందు ఈ కేసులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నాజిర్ వాదనలు విన్నారు.

అయోధ్య వివాదం భారత్‌లో ఒక రాజకీయ అంశంగా మారింది. హిందూ సంస్థల కార్యకర్తలు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు.

హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు సరిగ్గా అక్కడే జన్మించాడని భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్‌తోపాటు మరికొన్ని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. బాబ్రీ మసీదును నిజానికి ఒక ఆలయం కూల్చి నిర్మించారని వారు చెబుతున్నారు.

బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఆలయ నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని బదిలీ చేయాలని తీవ్రమైన డిమాండ్లు వచ్చాయి.

రామ మందిరం-బాబ్రీ మసీదు అంశంలో వివాదాస్పద భూమి యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

యాజమాన్య హక్కుల కేసు దేశంలోని కోర్టుల్లో 1949 నుంచి నడుస్తోంది. ఈ మొత్తం వివాదం ఎప్పుడు మొదలైంది, ఇప్పటివరకూ ఈ వివాదంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

Image copyrightGETTY IMAGES
1528: అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంగా భావించే ప్రాంతంలో ఒక మసీదు నిర్మించారు.
1853: మొదటి సారి ఈ స్థలం దగ్గర మత ఘర్షణలు జరిగాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ మసీదు నిర్మించారని చెబుతారు. అందుకే దీనికి బాబ్రీ మసీదు అనే పేరొచ్చిందని అంటారు. ఇప్పుడు కొన్ని హిందూ సంస్థలు అక్కడ రామమందిరం నిర్మించాలని భావిస్తున్నాయి.
Image copyrightGETTY IMAGES
1859: బ్రిటీష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. లోపల భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థించడానికి అనుమతి ఇచ్చారు.
1949: మసీదులో రాముడి విగ్రహాలు లభించాయి. కొంతమంది హిందువులు ఈ విగ్రహాలను అక్కడ ఉంచారని ఆరోపణలు వచ్చాయి. ముస్లింలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెండు వర్గాలు కోర్టులో కేసు వేశాయి. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించి దానికి తాళాలు వేసింది.
Image copyrightGETTY IMAGES
1984: కొంతమంది హిందువులు విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో శ్రీరాముడి జన్మస్థలానికి విముక్తి కల్పించి, రామమందిరం నిర్మించడానికి ఒక కమిటీని వేశారు. తర్వాత ఈ ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ ప్రముఖ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ నేతృత్వం వహించారు.
1986: జిల్లా మేజిస్ట్రేట్ హిందువులకు ప్రార్థించడానికి వివాదాస్పద మసీదు తాళం తీయమని ఆదేశించారు. ముస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ఏర్పాటు చేశారు.
1989: విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం తీవ్రం చేసింది. వివాదాస్పద స్థలం దగ్గర రామమందిరం పునాది వేసింది.
Image copyrightAFP
1990: విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బాబ్రీ మసీదును స్వల్పంగా ధ్వంసం చేశారు. అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు.
1992: విశ్వహిందూ పరిషత్, శివసేన, బీజేపీ కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2 వేల మందికిపైగా మరణించారు.
Image copyrightGETTY IMAGES
1998: ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2001: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం నిర్వహించడంపై ఉద్రిక్తతలు తలెత్తాయి. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ మరోసారి చెప్పింది.
2002 జనవరి: అయోధ్య వివాదం పరిష్కరించేందుకు ప్రధానమంత్రి వాజ్‌పేయి అయోధ్య కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ నేత శతృఘ్న్ సిన్హాను హిందూ, ముస్లిం నేతలతో చర్చల కోసం నియమించారు.
Image copyrightGETTY IMAGES
2002 ఫిబ్రవరి: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం అంశాన్ని చేర్చడానికి బీజేపీ నిరాకరించింది. మార్చి 15న రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. వందలాది మంది హిందూ కార్యకర్తలు అయోధ్యకు తరలివచ్చారు. తర్వాత తిరిగి రైల్లో వెళ్తున్న కార్యకర్తలపై గుజరాత్ గోధ్రా దగ్గర దాడి జరిగింది. అందులో 58 మంది కరసేవకులు చనిపోయారు.
Image copyrightAFP
13 మార్చి 2002: సుప్రీంకోర్టు తన తీర్పులో అయోధ్యలో యథాతథ స్థితి కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం స్వాధీనంలో ఉన్న భూమిలో ఎవరినీ అనుమతించకూడదని చెప్పింది. కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తామని చెప్పింది.
15 మార్చి 2002: మందిర పరిసరాలకు బయటే రాతి స్తంభాలను అప్పగిస్తామని విశ్వహిందూ పరిషత్, ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం వీహెచ్‌పీ నేతలు, దాదాపు 800 మంది కార్యకర్తలు ప్రభుత్వ అధికారులకు తాము మందిరం కోసం తీసుకొచ్చిన రాతి స్తంభాలను అందించారు.
22 జూన్, 2002: రామ మందిర నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
Image copyrightGETTY IMAGES
2003 జనవరి : వివాదాస్పద రామ మందిరం-బాబ్రీ మసీదు పరిసరాల కింద ఏదైనా ప్రాచీన భవనాల అవశేషాలు ఉన్నాయా అనేది తెలుసుకోడానికి రేడియో తరంగాల ద్వారా పరిశోధనలు జరిగాయి. కచ్చితమైన ఆధారాలు ఏవీ దొరకలేదు.
2003 మార్చి : వివాదాస్పద స్థలంలో పూజలు చేసుకోడానికి అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కోర్టు దానిని తోసిపుచ్చింది.
2003 ఏప్రిల్: అలహాబాద్ హైకోర్టు నిర్దేశాల ప్రకారం వివాదిత స్థలంలో పురాతత్వ శాఖ తవ్వకాలు ప్రారంభించింది. జూన్ వరకూ ఇవి సాగాయి. తర్వాత రిపోర్టులో మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని తెలిపారు.
2003 మే: ‘1992 బాబ్రీ మసీదు కూల్చివేత’ కేసులో అప్పటి ఉపప్రధాని అడ్వాణీసహా 8 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది.
2003 జూన్: కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కేసు పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించారు. జులై లోపు అయోధ్య అంశం పూర్తిగా పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
Image copyrightGETTY IMAGES
2003 ఆగస్టు: రామమందిర నిర్మాణం కోసం ప్రత్యేక బిల్లు తేవాలని కోరిన వీహెచ్‌పీ డిమాండును బీజేపీ నేతలు, ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ తోసిపుచ్చారు.
2004 ఏప్రిల్ : అడ్వాణీ అయోధ్యలోని తాత్కాలిక రామమందిరంలో పూజలు చేశారు. కచ్చితంగా ఆలయం నిర్మిస్తామని తెలిపారు.
2004 జులై: శివసేన చీఫ్ బాల్ ఠాకరే అయోధ్య వివాదాస్పద స్థలంలో మంగల్ పాండే పేరుతో ఏదైనా జాతీయ స్మారకం రూపొందించాలని సలహా ఇచ్చారు.
2005 జనవరి: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.
Image copyrightGETTY IMAGES
2005 జులై: ఐదుగురు సాయుధ మిలిటెంట్లు వివాదాస్పద స్థలం దగ్గర దాడికి దిగారు. మిలిటెంట్లను భద్రతా దళాలు బయటే కాల్చిచంపాయి. ఈ దాడిలో ఒక భారత పౌరుడు చనిపోయారు.
6 జులై, 2005: బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో ఉద్రేక పూరిత ప్రసంగం ఇచ్చిన కేసులో అడ్వాణీని కూడా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది.
28 జులై 2005: ఈ కేసులో అడ్వాణీ రాయ్ బరేలీలోని ఒక కోర్టుకు హాజరయ్యారు.
4 ఆగస్టు 2005: ఫైజాబాద్ కోర్టు ఈ కేసులో నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Image copyrightGETTY IMAGES
20 ఏప్రిల్ 2006: లిబ్రహాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేత ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలిపింది. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్, శివసేన చేతులు కలిపాయని చెప్పింది.
2006 జులై: వివాదాస్పద స్థలంలో ఉన్న తాత్కాలిక ఆలయం భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కంచె ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. దీనిని ముస్లిం సంస్థలు వ్యతిరేకించాయి. ఇది కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం అని చెప్పాయి.
Image copyrightGETTY IMAGES
19 మార్చి 2007: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని అయితే బాబ్రీ మసీదు కూలి ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్పందనలు వచ్చాయి.
30 జూన్ 2009: బాబ్రీ మసీదు కూల్చిన కేసులో విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబ్రహాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత తన రిపోర్ట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు అప్పగించింది.
7 జులై 2009: అయోధ్య వివాదానికి సంబంధించిన 23 కీలక ఫైళ్లు సెక్రటేరియట్ నుంచి మాయమయ్యాయని యూపీ ప్రభుత్వం ఒక అఫిడవిట్‌లో అంగీకరించింది.
Image copyrightGETTY IMAGES
24 నవంబర్ 2009: లిబ్రహాన్ రిపోర్ట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అందులో లిబ్రహన్ కమిటీ అటల్ బిహారీ వాజ్ పేయి, మీడియాను దోషిగా పేర్కొంది. నరసింహరావుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
20 మే, 2010: బాబ్రీ విధ్వంసం కేసులో అడ్వాణీ, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
26 జులై 2010: రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తి.
8 సెప్టెంబర్ 2010: కోర్టు అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
17 సెప్టెంబర్ 2010: తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది..
Image copyrightAFP
30 సెప్టెంబర్ 2010: అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ లక్నో ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని మూడు భాగాలుగా విభజించింది.
9 మే 2011: సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. విచారణ సమయంలో హైకోర్టు తీర్పు అమలు కాకుండా స్టే ఉంటుందని చెప్పింది. వివాదాస్పద స్థలంపై 1993 జనవరి 7 నాటి యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పింది.
26 ఫిబ్రవరి 2016: రామ మందిర నిర్మాణం గురించి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
20 జులై 2016: బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసులో వాది హషీమ్ అన్సారీ 96 ఏళ్ల వయసులో అయోధ్యలో మృతి చెందారు.
21మార్చి 2017: అయోధ్య వివాదం కేసును పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖెహర్ సూచించారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దీనిని చాలా మంది నేతలు స్వాగతించారు.
07 ఆగస్టు 2017: సుప్రీంకోర్టు 1994లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును సవాలు చేస్తు వచ్చిన పిటిషన్‌పై విచారణకు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏర్పాటు చేసింది.
08 ఆగస్టు 2017: యూపీ వక్ఫ్ బోర్డు అయోధ్య వివాదాస్పద భూమి నుంచి కాస్త దూరంలో ముస్లింలు ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టుకు చెప్పింది.
11 సెప్టెంబర్ 2017: సుప్రీంకోర్టు అయోధ్య రామజన్మభూమిపై నిఘా కోసం 10 రోజుల లోపు ఇద్దరు జడ్జిల పర్యవేక్షకులను నియమించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.
20 నవంబర్ 2017: యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుతో అయోధ్యలో మందిరం, లక్నోలో మసీదు నిర్మించవచ్చని చెప్పింది.
Image copyrightGETTY IMAGES
01 డిసెంబర్ 2017: 32మంది కార్యకర్తలు అలాహాబాద్ హైకోర్టులో 2010 తీర్పును సవాలు చేస్తూ ఇంటర్వెన్షన్ అప్లికేషన్ ఇచ్చారు. కార్యకర్తల్లో అపర్ణా సేన్, శ్యామ్ బెనగల్, తీస్తా శీతల్వాద్, సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారు.
08 ఫిబ్రవరి 2018: సుప్రీంకోర్టులో సివిల్ కేసులో విచారణలు ప్రారంభం
14 మార్చి 2018: సుప్రీంకోర్టు స్వామిసహా అందరి మధ్యంతర పిటిషన్లను కొట్టివేసింది.
06 ఏప్రిల్ 2018: 1994 తీర్పును పునఃపరిశీలించాలని ఈ కేసును ధర్మాసనానికి ఇవ్వాలని ముస్లిం పక్షాల తరపున సీనియర్ వకీలు రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
06 జులై 2018: కొన్ని ముస్లిం సంస్థలు 1994 తీర్పును పునఃపరిశీలించాలంటూ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Image copyrightGETTY IMAGES
13 జులై 2018: ఈ కేసులో జులై 20 నుంచి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
20 జులై 2018: సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
27 సెప్టంబర్ 2018: రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 1994 నాటి తీర్పును పునఃపరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. దానితోపాటు ఇస్మాయిల్ ఫారూఖీ కేసును రాజ్యాంగ ధర్మాసనం దగ్గరకు పంపడానికి కూడా అంగీకరించలేదు.
ఇవికూడా చదవండి:

Tuesday 27 November 2018

సుప్రీంకోర్టు–రామమందిరం

సుప్రీంకోర్టు–రామమందిరం
28-11-2018 00:23:01

నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సర్వోన్నత న్యాయస్థానం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైన విషయమేనా?

‘రాజ్యాంగ నైతికత అనేదాన్ని మనం పెంపొందించాలే కాని అది సహజంగా జరగదు. మన వాళ్లు దాన్ని ఇంకా నేర్చుకోవాల్సి ఉన్నది. భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక అప్రజాస్వామిక సమాజంపై అద్దిన పైమెరుగు మాత్రమే..’ అని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అన్నారు. సోమవారం నాడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కీలక ప్రశ్నలకు సమాధానం రావల్సి ఉన్నదన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హుందాగా జీవించే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్న చాలా విలువైనదే కాక అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగం పరిధిలో అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? అసలు రాజ్యాంగం ఎవరి కోసం? సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని రాజ్యాంగం మార్చివేసిందా?

అయినప్పటికీ జస్టిస్ గొగోయ్ అన్నట్లు రాజ్యాంగం అనేది మన జీవితాలతో పెనవేసుకుపోయింది. మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? అన్న ఆవేదనను జస్టిస్ గొగోయ్ వ్యక్తం చేశారు. మనిషి ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛా సమానత్వాలను ఆ వ్యక్తి పాదాల క్రింద పణంగా పెట్టలేమని, అతడిని విశ్వసించి, సంస్థలను కాలరాసే అధికారాన్ని ఆ వ్యక్తికి అప్పజెప్పలేమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను, స్వేచ్ఛా సమానత్వాలను పరిరక్షించకపోతే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. గొగోయ్ ఎవర్ని, ఏ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారో మనం ఊహించుకోవాల్సిందే కాని మన దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకూ, ఆయన వ్యాఖ్యలకూ సంబంధం లేదని మాత్రం చెప్పలేం.

రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల సభలో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం కేసులో తీర్పు చెప్పవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కాంగ్రెస్‌ పార్టీ భయపెడుతోందని, ప్రధాన న్యాయమూర్తిని అభిశంసిస్తామని కూడా హెచ్చరించిందని ఆరోపించారు. ఒక ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టును ఎన్నికల సభల్లో ప్రస్తావనకు తీసుకురావడం అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా రాజకీయాల్లోకి లాగాలని భావిస్తున్నట్లే అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వతంత్రంగా లేరని, కాంగ్రెస్ భయపెడితే భయపడేవారని చెప్పడమే ఆయన ఉద్దేశమా? ప్రధానమంత్రే ఇలా అంటే న్యాయవ్యవస్థపై ఎవరికి గౌరవం ఉంటుంది? నిజానికి గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టదలుచుకున్న అభిశంసన తీర్మానానికీ అయోధ్యలో రామమందిరం అంశానికీ ఏ మాత్రం సంబంధం లేదు. అవి ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. మరి ప్రధానమంత్రి ఈ అభిశంసన తీర్మానానికీ, అయోధ్యలో రామమందిరానికి సంబంధించిన కేసుకూ ఎందుకు ముడిపెడుతున్నారు? ఇందులో ఏదో మతలబు ఉన్నదన్నమాట. ప్రధానమంత్రి మాటలే నిజమైతే జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే అయోధ్య కేసును తేల్చివేసి రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించిందని, దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకే అభిశంసన తీర్మానాన్ని ముందుకు తెచ్చాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో ఆయనకూ, ప్రభుత్వానికీ మధ్య ఒక అవగాహన ఏర్పడి ఉండవచ్చుననే అనుమానాలకూ ప్రధాని ప్రకటన తావిస్తున్నది.

ఏ కారణాల వల్లనైతేనేం, జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనే లేదు. అయోధ్యపై కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి నిరాకరించి, అక్టోబర్ 29 నుంచి ప్రతి రోజూ విచారణ జరుగుతుందని తీర్పు చెప్పి మరీ ఆయన పదవీవిరమణ చేశారు కాని ఆయన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గొగోయ్ ఆ తీర్పును ప్రక్కన పెట్టారు. ‘మాకింతకన్నా ముఖ్యమైన విషయాలెన్నో ఉన్నాయి.’ అని ఆయన ఈ కేసు విచారణను జనవరి నెలకు వాయిదా వేశారు.

నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి కూడా ఎన్నికల సమయంలో తప్ప అయోధ్య అంత ముఖ్యమైన విషయం కాదని ఆ కేసు విచారణ జరిగిన తేదీలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. అయోధ్య భూ వివాదంపై 2011 మేలోనే సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ స్టే ఎత్తి వేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. కోర్టు వెలుపల ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా 2017 మార్చిలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహార్ చెప్పినప్పటికీ నరేంద్రమోదీ కానీ, బిజెపి కానీ, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ కానీ అటువంటి పరిష్కారానికి ఆసక్తి ప్రదర్శించలేదు. మళ్లీ జస్టిస్ దీపక్ మిశ్రా హయాంలోనే 2018లో ఈ కేసులో చురుకుగా కదలిక ఏర్పడింది. కాని జస్టిస్ గొగోయ్ నిర్ణయం వల్ల బిజెపి, సంఘ్ పరివార్ సంస్థలు హతాశులైనట్లు కనపడుతోంది. నాలుగున్నరేళ్ల పాటు అయోధ్య సమస్య పరిష్కారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించకుండా ఎన్నికల సమయంలో అయోధ్యపై తీర్పు కావాలని మోదీ సర్కార్ భావిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు స్పందించాలి? తాను అనుకున్నప్పుడల్లా, తన రాజకీయ ప్రయోజనాలకోసం సుప్రీం స్పందించాలని ప్రభుత్వం భావించడం సరైనదా?

నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఎన్నికల ప్రయోజనాలకు సంఘ్ పరివార్ పూర్తిగా అండదండనిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ఆర్ఎస్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, సాధువులు ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తే ముస్లింలు సహనాన్ని కోల్పోతున్నారని కేంద్రమంత్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అయోధ్యలో శివసైనికులు, విహెచ్‌పి భారీ ఎత్తున లక్షమందికి పైగా సాధువులు, కార్యకర్తలతో బలప్రదర్శన చేయాలని నిర్ణయించడం 1992 డిసెంబర్ 6 నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. అటు కేంద్రంలోనూ, ఉత్తర ప్రదేశ్‌లోనూ బిజెపి సర్కార్ ఉన్నందువల్ల బలసమీకరణ చేయడం ఆ సంస్థలకు అంత కష్టం కాకపోవచ్చు.

తాజాగా నరేంద్రమోదీ చేసిన ప్రకటన రామమందిరం విషయంలో సంఘ్ పరివార్ సంస్థల ఆందోళనకు మరింత బలం చేకూర్చినట్లయింది. రామమందిర నిర్మాణం తాను కావాలని కోరుకుంటున్నానని, కాని కాంగ్రెస్ పార్టీయే సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బెదిరించి తీర్పు రాకుండా చేసిందని ఆయన తేల్చేసినట్లు స్పష్టమవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇండోర్‌లో ప్రకటించారు. దీని వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రజల భావోద్వేగాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరగబోయే సార్వత్రక ఎన్నికల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భావోద్వేగాలను రేకెత్తించి ప్రయోజనం పొందేందుకు కూడా మోదీ రంగం సిద్ధం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుపై అయోధ్య విషయంలో ఒత్తిడి పెంచుతున్నది ఎవరు? కాంగ్రెసా లేక మోదీ, షా, సంఘ్ పరివార్ పెద్దలా.. అన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు. జనవరిలో సుప్రీం కోర్టు అయోధ్యపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం కాని కోర్టు తీర్పుకు ముందే న్యాయ వ్యవస్థ, చట్టాలకు అతీతంగా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నిజానికి మోదీ హయాంలో దేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, స్మార్ట్ సిటీలతో దేశం వర్ధిల్లితే, నిరుద్యోగం, పేదరికం సమసిపోతే, నల్లధనం దేశానికి తిరిగి వస్తే భావోద్వేగాలు కల్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇవాళ మధ్యప్రదేశ్‌లోనూ, రాజస్థాన్‌లోనూ నరేంద్ర మోదీ సభలకు జనం అంతగా ఆకర్షితులు కావడం లేదు. సిబిఐలో జరుగుతున్న పరిణామాలు, రాఫెల్ డీల్ వంటి అంశాలపై సుప్రీం కోర్టు లో సాగుతున్న విచారణ, ప్రతిపక్షాలు ఏకం కావడం మొదలైన అంశాలపై కూడా వారు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తమ దైనందిన సమస్యల గురించి వారు మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాటికి జవాబు చెప్పే ధైర్యం లేనందువల్లే మోదీ, ఆయన అభిమాన సంఘీయులు భావోద్వేగ అంశాలను లేవనేత్తి భయభ్రాంత వాతావరణం కల్పిస్త్తున్నారు. తాను కామ్ ధర్ (నిరంతరం పనిచేసే) ప్రధానినని, అచ్ఛేదిన్ (మంచిరోజులు) వస్తాయని మోదీ చెప్పిన మాటలు ప్రశ్నార్థకమవుతున్నాయి.

ఎన్నికల పర్యటనలో భాగంగా ఇండోర్‌లో ఒక బిజెపి మిత్రుడి ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన సోదరుడు, సంఘ్ సీనియర్ నేత, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ బాధ్యతలు చూసే పెద్ద మనిషి కనిపించారు. ‘మా సోదరుడి మాటలతో నేను ఏకీ భవించను. నరేంద్రమోదీ, అమిత్ షా హయాంలో పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది.. ఒకప్పుడు మధ్యప్రదేశ్‌లో బిజెపి సర్కార్ రావడానికి ఎంతో కృషి చేసిన మమ్మల్ని ఎవరూ లెక్కచేయడం లేదు.. ఇండోర్ లో పార్టీకి దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వస్తాయి..’ అని బిజెపి మిత్రుడు చెప్పారు. కాని ఆర్ఎస్ఎస్ పెద్దమనిషి మాత్రం మోదీ హయాంలో దేశంలో హిందూ మత భావనలకు విలువ, హిందువులకు ధైర్యం పెరిగిందని అన్నారు. ‘రాహుల్ గాంధీ కూడా దేవాలయాలకు వెళుతున్నారు.. మాకింకేం కావాలి? మోదీ దేశానికి ఏం చేశారా అని నన్నడగకండి.. మాకు కావల్సింది చేస్తున్నారు..’ అని ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. ఇక ప్రజలు ఏమి చేస్తారో కాలం తేలుస్తుంది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

గోమాంసం ఓకే BJP at Mizoram

గోమాంసం ఓకే
28-11-2018 02:28:54

మిషనరీకి టికెట్‌
మిజోరంలో కమలం రూటే వేరు
స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించటం, వాటికి తగట్టుగా తమ విధానాలను మార్చుకోవటం రాజకీయ పార్టీలకు ప్రాణావసరం. బీజేపీలాంటి జాతీయ పార్టీలు కూడా కొన్ని సందర్భాలలో స్థానికావసరాలుగా తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోకతప్పదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మిజోరం. 87 శాతం క్రైస్తవులు నివసించే ఈ రాష్ట్రంలో ఆచారాలు, వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీ దీనికి తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకుంటూ వచ్చింది.

మతమార్పిడులకు సంబంధించిన అంశాలలో క్రైస్తవ మిషనరీల పాత్రపై బీజేపీ, దాని అనుబంధ సంస్థలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. అలాంటి బీజేపీలోకి క్రైస్తవ మిషనరీ రెవరెండ్‌ ఎల్‌.ఆర్‌. కోల్నిని చేర్చుకోవటం.. ఆయనకు వెంటనే అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వటం మిజోరంలో చర్చనీయాంశమయింది. ఇప్పటి దాకా బీజేపీ ఓట్ల కోసం చక్మాలు, బౌద్ధులపైనే ఆధారపడుతూ వచ్చింది.

అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం సాధించాలంటే వారిని కూడా తమతో కలుపుకొని పోవాలని బీజేపీ భావిస్తోంది. ‘‘మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మా ప్రత్యర్థులు మాపై అలాంటి ముద్ర వేస్తున్నారు. క్రైస్తవులు అధికంగా ఉన్న మూడు ఈశాన్య రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు కదా?’’ అంటారు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర వహించిన బిశ్వశర్మ. ఈ ఎన్నికల్లో గెలిస్తే- తాము క్రైస్తవులకు వ్యతిరేకం కాదని చెప్పటానికి ఒక ఉదాహరణగా బీజేపీ ప్రయత్నం చేయవచ్చు.

బీఫ్‌పై వైఖరి వేరే!
మిజోరంలో ఎక్కువ మంది ప్రజలు గోమాంసాన్ని తింటారు. పర్వతసానువుల్లో ఉన్న తమకు అదే బలవర్ధకమైన ఆహారమని వారు భావిస్తారు. గోమాంసం విషయంలో, బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానం అందరికి తెలిసిందే! అయితే మిజోరంలో మాత్రం బీజేపీ చాలా భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశమే కాదని.. తాము స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లలో కలగజేసుకోబోమనేది బీజేపీ నేతల వాదన. బీజేపీ కేంద్రనాయకత్వం, దాని అనుబంధ సంస్థలు ఈ వైఖరినే సమర్థిస్తున్నాయి. బీఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటుగా, సంపూర్ణ మద్య నిషేధంపై కూడా బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మిజోరంలో కాంగ్రెస్‌ సర్కారు 2014లో మద్యనిషేధాన్ని ఎత్తివేసింది. దీని వల్ల యువత మద్యానికి బానిసలు అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఇదొక ప్రధానమైన ప్రచారాంశంగా మారింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తాము సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటిస్తే.. కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వస్తే చర్చితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామంటోంది.

మద్యనిషేధానికి సంబంధించి బీజేపీకి జాతీయ విధానమేమీ లేదు. గుజరాత్‌తో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో ఆ విషయానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వటం లేదు. మిజోరంలో మాత్రం- తాము అధికారంలోకి వస్తే స్థానికంగా ఉత్పత్తి చేసే మద్యాన్ని అనుమతిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే మద్యాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.

‘అధికారంలోకి వస్తాం.. అక్బరుద్దీన్‌ మెడలు వంచుతాం’

‘అధికారంలోకి వస్తాం.. అక్బరుద్దీన్‌ మెడలు వంచుతాం’
Nov 27, 2018, 16:44 IST
 Swami Paripoornananda Fires On KCR And Akbaruddin Owaisi In Medak Meeting - Sakshi
సాక్షి, మెదక్‌ : తెలంగాణలో 70 సీట్లు గెల్చి.. మెదక్‌లో అక్బరుద్దీన్‌ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలు మోదీ దగ్గరకు వచ్చి ట్రిపుల్‌ తలాక్‌పై నిర్ణయం తీసుకోమని కోరారని తెలిపారు. అప్పుడు మోదీ తలాక్‌ను తీసి వేయించి.. ముస్లిం మహిళలు తల ఎత్తుకునేలా చేసి.. అక్బరుద్దీన్‌ ఓవైసీకి ఝలక్‌ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అక్బరుద్దీన్‌ ఓవైసీనీ హైదరాబాద్‌లో తల దించుకుని తిరిగే రోజులోస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదవారికి రూ. 5 లక్షల రూపాలయతో వైద్యం, రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు.

సింగూరు మెదక్‌ ప్రజల హక్కని కానీ.. దాదాపు 15 టీఎంసీల నీటిని ఆక్రమంగా తరలించుకుపోయారని పరిపూర్ణానందా ఆరోపించారు. ఈ నీటిని పూర్తిగా మెదక్‌ ప్రజల తాగు, సాగు నీటి అవసరాల కోసం అందిస్తామన్నారు. కుంభకర్ణుడు కూడా 6 నెలలే పడుకుంటాడు.. కానీ కేసీఆర్‌ మాత్రం ఎప్పటికి నిద్ర పోతూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. రామయం పేటను డివిజన్‌ కేంద్రంగా మారుస్తామనే మాట మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఇక్కడ పీజీ కాలేజీ, పాలిటెక్నికల్‌ కాలేజ్‌లు తీసుకోస్తామని పరిపూర్ణానందా హామీ ఇచ్చారు. ఆడపడుచుల కళ్లల్లో కన్నీరు చూడొద్దనే ఉద్దేశంతోనే.. ఉజ్వల పథకం ద్వారా మోదీ ఇంటింటికి గ్యాస్‌ పొయ్యి అందించారని చెప్పుకొచ్చారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత బీజేపీదని పరిపూర్ణానంద తెలిపారు. మెదక్‌ నియోజకవర్గంలో 1,60,000 డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. మోదీ ఇచ్చే 800 రూపాయలకు, రూ. 200 కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్‌ ఇచ్చిందని.. వాస్తవానికి కేసీఆర్‌ ఇచ్చేది రూ. 200 రూపాయలే అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మూసివేసిన ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు పది మంది పొట్టగొట్టే పార్టీలని ఆయన విమర్శించారు

బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం - బుడన్‌బేగ్‌

 బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం -  బుడన్‌బేగ్‌ 

‘బీజేపీతో లోపాయికారీ ఒప్పందం.. అందుకే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా..’

టీఆర్‌ఎస్‌కు బేగ్‌ రాజీనామా!
ఐడీసీ చైర్మన్‌ పదవికీ గుడ్‌బై చెప్పనున్న మైనారిటీ నేత
రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- ఖమ్మం): టీఆర్‌ఎస్‌కు ఖమ్మం జిల్లాలో ఊహించని షాక్‌ తగి లింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, ఇతర కారణాలతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న వారు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న ఖమ్మం జిల్లా మైనారిటీ నేత బుడన్‌బేగ్‌ టీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఖమ్మంలో రాహుల్‌, చంద్రబాబు హాజరు కానున్న మహాకూటమి సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన ‘దేశం’ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే బేగ్‌ మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి, అందుకు దారితీసిన కార ణాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించనున్నారు. తొలుత సీపీఐలో పనిచేసిన బుడాన్‌బేగ్‌ తెలం గాణ ఉద్యమ తరుణంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

గత లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన గతేడాది పరి శ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుల య్యారు. అయితే ఈ సారి అసెంబ్లీ టికెట్‌ ఆశించిన ఆయనకు ఆ అవకాశం లభించక పోవడంతో అసంతృప్తితో ఉంటూనే ఆయన పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 19న ఖమ్మంలో నిర్వహించిన కేసీఆర్‌ బహిరంగ సభకు కూడా బేగ్‌ అధ్యక్షత వహించడంతో పాటు అన్నీ తానై నడిపించారు. అయితే మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ బరిలో ఉన్న టీడీపీ నేత నామ నాగేశ్వ రరావు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో చర్చలు జరిపారు. అనంతరం విషయాన్ని నామ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో సముచిత స్థానం కల్పి స్తామని టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ రావడంతో టీడీపీలో చేరాలని బేగ్‌ నిర్ణయం తీసుకు న్నారు. అయితే బేగ్‌ పార్టీ మారు తున్నా రన్న విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా... ఫలించలేదు. మున్ముందు ఆయన టీఆర్‌ఎస్‌ లో కొనసాగేందుకు అయిష్టత చూపి నట్టు సమాచారం. తొలినుంచి టీఆర్‌ఎస్‌ జెండా పట్టిన బేగ్‌ ఆపార్టీని వీడి టీడీపీలో చేరుతు న్నారన్న విషయం చర్చనీయాంశం అయ్యింది. దీంతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలూ టీడీపీ బాటపట్ట నున్న ట్టు పుకార్లుషికారు చేస్తు న్నాయి.

టీడీపీలో చేరుతున్నా... : బేగ్‌
పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ బేగ్‌ను సంప్రదించగా.. తాను మంగళవారం టీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి బుధవారం టీడీపీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘సేవ్‌ ఇండియా’ నినాదంతో చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా లౌకికశక్తుల ఐక్యతకు కృషి చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని మైనార్టీల అభివృద్ధి, సం క్షేమాన్ని విస్మరించారని, అందువల్లే తాను టీఆర్‌ఎస్‌ కు రాజీనామాచేసి టీడీపీలో చేరాలని నిర్ణయిం చుకున్నట్టు స్పష్టంచేశారు.

Activist Rehana Fathima, Who Attempted Sabarimala Trek, Arrested for Facebook Post

Activist Rehana Fathima, Who Attempted Sabarimala Trek, Arrested for Facebook Post
A case was registered against her for putting up “communally divisive” social media posts on October 22, three days after her failed attempt to enter Sabarimala.
News18.comUpdated:November 27, 2018, 3:03 PM IST facebookTwittergoogleskype
Activist Rehana Fathima, Who Attempted Sabarimala Trek, Arrested for Facebook Post Activist Rehana Fathima being escorted by the police to Sabarimala Temple, Kerala. (File Image: PTI)
Thiruvananthapuram: Activist Rehana Fathima was arrested on Tuesday by the Pathanamthitta police on the charges of hurting religious sentiments with a Facebook post, over a month after she was forced to abort her attempt to enter the Sabarimala temple in the face of violent protests. 

Fathima was arrested from her house in Kochi and is currently being taken to the Pathanamthitta town police station for questioning, officials said. 


A case was registered against her for putting up “communally divisive” social media posts on October 22, three days after her failed attempt to enter Sabarimala. 

She had posted a photo of herself on her Facebook page on September 30, dressed as an Ayyappa devotee wearing a rudraksha and sporting a patta, with the caption 'Tatvamasi'. The case was registered following a complaint filed by the Sabarimala Samrakshana Samithi alleging that her posts hurt religious sentiments of Ayyappa devottees.

She has been booked under Section 295A of the Indian Penal Code (deliberate and malicious acts, intended to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs). Earlier this month, the Kerala High Court had rejected the anticipatory bail plea of the activist and asked the police to take whatever necessary action it deemed fit.

Fathima, a model and activist who was part of "Kiss of Love" movement in Kochi in 2014 against alleged moral policing, was among the two women who had reached the hilltop on October 19 but had to return before reaching the sanctum sanctorum following massive protests by Ayyappa devotees. The head priest threatened to shut down the shrine and stop prayers. 

Earlier, the Kerala Muslim Jama'ath Council had also expelled her from the Muslim community for "hurting sentiments of lakhs of Hindu devotees". 

“People, not the devotees, who want to disrupt peace didn't allow us to enter. I want to know what the reason was. Tell me, in which way one needs to be a devotee. You tell me that first and then I will tell you if I'm a devotee or not," Fathima had said at the time. 

Fathima's house in Kochi was also ransacked after it came on news that she was enroute Sabarimala Temple where the ban on entry of women of all ages was lifted by the Supreme Court in September.

Saturday 17 November 2018

మత రాజకీయాలు చేస్తున్నందునే కాంగ్రెస్‌ వైఫల్యం

మత రాజకీయాలు చేస్తున్నందునే కాంగ్రెస్‌ వైఫల్యం
17-11-2018 01:26:16

కాంగ్రెస్‌ మతవాద రాజకీయాలకు పాల్పడటం వల్లే జాతీయ స్థాయిలో విఫలమవుతోంది. మత రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లే నెహ్రూ, ఇందిరాగాంధీ విశిష్ట నేతలుగా వర్థిల్లారు. రాహుల్‌గాంధీ ఇంకా నాయకుడిగా ఎదగలేదు. ఆయన ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ప్రజలు అంగీకరించినప్పుడే ఆయన నాయకుడు అవుతారు. ఆయనేదైనా పదవి చేపడితే అప్పుడు అర్థం చేసుకుంటారు.
- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌

Friday 16 November 2018

CONGRESS MANIFESTO FOR 1014 LOK SABHA ELECTIONS

CONGRESS MANIFESTO FOR 1014 LOK SABHA ELECTIONS

https://www.inc.in/images/Pages/English%20Manifesto%20for%20Web.pdf

Wednesday 14 November 2018

Ten years after Sachar Report

Ten years after Sachar Report
There’s been no major change in the condition of India’s Muslims. Here are the numbers:
4K
SHARES
SHARE



Written by ZEESHAN SHAIKH | Updated: December 26, 2016 8:40:17 am
 Sachar report, Sachar report details, Sachar report progress, muslims, india muslims, muslims in india, indian muslims, muslims india, india news

The Sachar Committee said India’s Muslims were more backward than even the Scheduled Castes and Scheduled Tribes. (Source: Representational image/Reuters file)
On November 30, 2006, the 403-page report of the Sachar Committee, on the social, economic and educational condition of Muslims in India, was tabled in Parliament. The Committee, headed by former Chief Justice of Delhi High Court Rajinder Sachar, was set up soon after the UPA 1 government took over, and it submitted its findings in less than 2 years.

The Report highlighted a range of disabilities faced by the community, and made a slew of recommendations to address the situation. It placed Indian Muslims below Scheduled Castes and Scheduled Tribes in backwardness. Among the many issues it highlighted were the huge mismatch between the percentage of Muslims in the population and in decisionmaking positions such as the IAS and IPS, and the general poor representation of the community in the police.

Sachar report, Sachar report details, Sachar report progress, muslims, india muslims, muslims in india, indian muslims, muslims india, india news The Report highlighted a range of disabilities faced by the community, and made a slew of recommendations to address the situation. It placed Indian Muslims below Scheduled Castes and Scheduled Tribes in backwardness.
An analysis of government data show that most indicators have not seen significant improvement in the years since the Report was submitted. In some cases things seem to have, in fact, deteriorated — in 2005, for example, the share of Muslims among India’s police forces was 7.63%; in 2013, it fell to 6.27%. The government subsequently stopped releasing data on police personnel broken down by religion.

In the years both preceding and following Sachar, Muslims continued to have the lowest average monthly per capita expenditure (MPCE) among all communities. The work participation rate for Muslim men increased only slightly to 49.5% in 2011 from 47.5% in 2001; for Muslim women, the increase was even smaller, from 14.1% in 2001 to 14.8% in 2011.

Sachar report, Sachar report details, Sachar report progress, muslims, india muslims, muslims in india, indian muslims, muslims india, india news Only 3 out of 100 IAS, IPS are Muslim.
Perhaps the most telling figures are in the IAS and IPS, the country’s top officialdom. The Sachar Committee recorded the percentage of Muslims in the IAS and IPS as 3% and 4% respectively. These numbers were 3.32% and 3.19% respectively on January 1, 2016, Home Ministry data show. The fall in Muslim representation in the IPS was due primarily to a steep fall in the share of Muslim promotee officers in the IPS — from 7.1% in the Sachar Report to merely 3.82% at the beginning of 2016.

As per the Census of 2001, Muslims were 13.43% of India’s population; in 2011, they were 14.2%. The increase of 24.69% in the population of Muslims between the two Censuses was the smallest ever recorded for the community.

The sex ratio among Muslims remained better than that of India overall in both 2001 and 2011, and the percentage of Muslims living in urban centres too remained higher than the national average in both Censuses.

Tuesday 13 November 2018

నకిలీ వార్తలు ఇలా పుడతాయా?

నకిలీ వార్తలు ఇలా పుడతాయా?
Nov 13, 2018, 15:48 IST
 Nail-Polish Fatwa Shows How Fake News Is Manufactured - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం మహిళలు గోళ్ల పెయింట్‌ (నేల్‌ పాలిష్‌) వాడ కూడదు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం అంటూ దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ ఫత్వాను జారీ చేసిందీ’ అని నవంబర్‌ ఐదవ తేదీన ఏఎన్‌ఐ (ఆసియా న్యూస్‌ ఇంటర్నేషనల్‌) చేసిన ట్వీట్‌ వైరల్‌ అవడంతో పలు న్యూస్‌ ఛానళ్లు, వార్తా పత్రికలు ఆ ఫత్వాను హైలెట్‌ చేస్తూ హల్‌చల్‌ చేశాయి. కొన్ని వార్తా ఛానళ్లు చర్చా గోష్టిలను కూడా నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌ జిల్లాలోని ఇస్లామిక్‌ స్కూల్‌ ‘దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌’ ముఫ్తీ (మత గురువు) ఇష్రార్‌ గౌర ఈ ఫత్వాను జారీ చేసినట్లు ఓ ఫొటోతో ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది.

ఆ ఫత్వా నకిలీదని నకిలీ వార్తలను కనిపెట్టడంలో ఆరితేరిన ‘ఆల్ట్‌ న్యూస్‌’ దర్యాప్తులో తేల్చింది. ఆయన దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ మత గురువు కాకపోవడమే కాకుండా ఆ స్కూల్‌తోని ఎలాంటి సంబంధం లేదు. ఆయన సహ్రాన్‌పూర్‌లోని జమా మసీదు పాత ఇమామ్‌ కుమారుడు, ప్రస్తుత ఇమామ్‌ సోదరుడని తేలింది. ‘తమరు ఏ హోదాలో ఫత్వా జారి చేశారు ?’ అంటూ సదరు ఇష్రార్‌ గౌరకు ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి ఫోన్‌ చేయగా, తన పేరు ఇష్రార్‌ గౌర కాదని, ఇషాక్‌ గౌర అని, తాను 1990 దశకంలో జారీ అయినా ఓ ఇస్లాం ఫత్వా గురించి ప్రస్తావించానని, ముస్లింలు మహిళలు గోళ్లకు రంగులకు బదులుగా మెహిందీ వాడాలని ఫత్వా సూచించినట్లు చెప్పానని, తన మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా ట్వీట్‌ పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే ఏఎన్‌ఐ ప్రతినిధిని ప్రశ్నించగా ఎక్కడో పొరపాటు జరిగిందని, తప్పు తెలియగానే సరిదిద్దు కున్నామని చెప్పారు.\

1990 దశకంలో కూడా అలాంటి ఫత్వా జారీ అయివుంటుందన్నది కూడా అనుమానమే. ఇస్లాం స్కూల్‌ వెబ్‌సైట్‌లో ఇంతవరకు జారీ చేసిన అన్ని ఫత్వాలు ఉన్నాయి. అందులో ఈ ఫత్వాలేదు. ఈ విషయమై దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ నిర్వాహకులను ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఏఎన్‌ఐకి దేశవ్యాప్తంగా 50 బ్యూరోలు ఉన్నాయి. అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి వార్తా ఛానళ్లు దానికి విస్తృత ప్రచారం కల్పించడం శోచనీయం.

Monday 12 November 2018

తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం - బి. నందగోపాల్‌

అనాథ బాలికల కంటిరెప్ప
Jun 14, 2018, 00:03 IST
 Nandha gopal help to Orphan girls - Sakshi

https://www.sakshi.com/news/family/nandha-gopal-help-orphan-girls-1086161
తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం - బి. నందగోపాల్‌

అబ్జర్వేషన్‌ హోమ్‌

గోరుముద్దలు పెట్టి, జాబిల్లి కథలు చెప్పి నిద్రపుచ్చాల్సిన అమ్మ  వద్దనుకుంది. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న వదలించుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్లనో, కుటుంబ కలహాల కారణంగానో, బిడ్డకు అంగవైకల్యమనో, ఆడపిల్ల భారమనో ఇలా.. పురిటి గుడ్డుగానే ఎంతోమంది అనా«థలవుతున్నారు. ఆకలే తల్లిగా, ఆవేదనే తండ్రిగా, ఒంటరితనంతో అనాథలెందరో రోడ్ల పక్కన చేరి ఆలమటిస్తూ, కన్నీళ్లే తోడుగా, బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ, ప్రేమ కోసం పరితపిస్తూ కనిపిస్తుంటారు. అలాంటి వారికి అమ్మ, నాన్నలా బాధ్యతగా ఆశ్రయం కల్పించి ఆదరిస్తోంది తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం. అనాథలను అక్కున చేర్చుకుని అన్ని వసతులతో వారిని పెంచడమే కాకుండా, వారికి పెళ్లి కూడా జరిపిస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4 కోట్లకు పైగా అనాథలు ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో వీరు నాలుగు శాతం.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మందికిపైగా అనా«థలు ఉన్నారు. అమ్మ ఒడికి , నాన్న లాలనకు నోచుకోని ఈ పిల్లల్లో అధిక శాతం ఆడపిల్లలే. అలా కన్నవారికి దూరమై సమాజంలో నిరాదరణకు గురైన బాలికలను చేరదీస్తోంది  తిరుపతి అనంత వీధిలోని ప్రభుత్వ ప్రత్యేక ‘చిల్డ్రన్స్‌ హోమ్, అబ్జర్వేషన్‌ హోమ్‌ ఫర్‌ గర్ల్స్‌’. అంతే కాదు,కోరుకున్న చదువు చెప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రోత్సహిస్తోంది ఈ హోమ్‌. ఆఖరికి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసే బాధ్యతను సైతం తీసుకుంటోంది. 2008లో ఆరుమంది అనా«థపిల్లలతో ప్రారంభమైన హోమ్‌లో ప్రస్తుతం 136 మంది ఉన్నారు.

హైటెక్‌ వసతులు
ఈ వసతి గృహంలో అనాథ బాలికలకు అనేక హైటెక్‌ వసతులు కల్పిస్తున్నారు. సోలార్‌ వాటర్‌ప్లాంట్, ఆర్వో ప్యూరిఫైడ్‌ వాటర్‌ సిస్టం, వాషింగ్‌ మిషన్లు, ఇన్వర్టర్, కంప్యూటర్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలతో పాటు తరచు స్పెషల్‌ మెనూతో ఆరోగ్యవంతమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ట్యూషన్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఇండోర్‌ క్రీడల సౌకర్యం, నాటికలు, పురాణ కథలు, డ్రామాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే, ధ్యానంతో వారిలో ఆత్మసై ్థర్యాన్ని నింపుతున్నారు. ఏడాదికోసారి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాళహస్తి, మదనపల్లి, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో విహార యాత్రలకు సైతం తీసుకెళుతుంటారు.


విద్యతో పాటు వివాహం
బాలికల సంరక్షణతో పాటు ఉన్నత విద్యపై వారికి అవగాహన కల్పించి ఉపాధి ఉద్యోగాల వైపు వారిని నడిపించాలనే సంకల్పంతో బాలికల వసతి గృహ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. బయటి విద్యార్థులకు దీటుగా కోరుకున్న చదువును చదివిస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ గ్రాంట్స్‌తో పాటు దాతల సహాయంతో చదువులో రాణించే బాలికలను పేరొందిన ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్‌ వంటి కోర్సుల్లో చాలా మందికి ప్రవేశాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ఏడు మంది అనాథ యువతులకు ప్రభుత్వ అనుమతితో  వివాహం చేశారు. గత ఏడాది నలుగురు అనాథ బాలికలకు  వివాహం చేశారు.

పెళ్లిసందడి మొదలైంది
ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో హోమ్‌లోని యువతులకు వివాహాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో పర్యవేక్షణా గృహంలో అప్పుడే పెళ్లిసందడి నెలకొంది. వందల సంఖ్యలో వరుళ్ల బయోడేటాలు, ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులతో పాటు కార్పొరేట్‌ స్థాయి ఉద్యోగులు, ఉన్నతస్థాయి కుటుంబాలు సైతం వధువు కోసం దరఖాస్తులు పంపుతున్నారు.
పెళ్లి తర్వాత పుట్టింటì  తంతువివాహానంతరం పుట్టింటి నుంచి ఆడపడుచుకు పసుపు, కుంకుమ అందించడం ప్రతి కుటుంబంలో సాగే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పర్యవేక్షణ గృహ ప్రతినిధులు పాటిస్తూ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు. ప్రతి పండుగకు సాంప్రదాయ బద్దంగా గృహానికి ఆçహ్వానించి ఆడపడుచులకు కొత్తబట్టలు పెడుతున్నారు.
– పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి

వరుడి ఎంపికకు ప్రత్యేక కమిటీ
సామాజిక స్పృహ, నైతిక విలువలే ప్రాతిపదికగా ఏర్పాటైన ప్రత్యేక కమిటీతో హోమ్‌లోని యువతులకు వరుడి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఓ ప్రభుత్వ అధికారి, న్యాయవాది, స్వచ్చంధ సంస్థ ప్రతినిధి, హోం అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వరుడి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటుగా అతని సత్ప్రవర్తనపై ఆరా తీసి, ఆ తర్వాత మాత్రమే వధువును చూపించడం జరుగుతుంది. వరుడికి ఆరోగ్య పరమైన పరీక్షలు కూడా నిర్వహించడం విశేషం. ఈ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించడంతో పాటు వధువుకు వివాహ భద్రత కల్పించేలా వరుడు, వరుడి తల్లిదండ్రుల నుంచి కూడా లిఖితపూర్వకంగా హామీ పత్రాలపై సంతకాలు తీసుకుంటుంది. 

పన్నెండు పెళ్లిళ్లకు ప్రణాళిక
ఈ ఏడాది సెప్టెంబర్‌ మా హోమ్‌లో 18 సంవత్సరాల వయస్సు నిండిన  పన్నెండు మంది అనా«థ యువతులకు వివాహాలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏ కొరతా లేకుండా ప్రభుత్వ సాయంతో, దాతల ఔదార్యంతో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా రూ.50వేల నగదును వధువు పేరిట బ్యాంకు ఖాతాలో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. అంతేకాదు, వివాహాలు  జరిగిన వారికి నా సొంత ఆస్తిలో 15 అంకణాల ఇంటిస్థలాన్ని ఇవ్వడానికి వైఎస్సార్‌ కడపజిల్లా కోడూరులో పనులు  కూడా ప్రారంభించాను. పది సంవత్సరాలుగా వీరితో మమేకమై వీరికి తండ్రిలా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం నాకు విజయవాడకు రీజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ అధికారిగా బదిలీ అయింది.
– బి. నందగోపాల్‌

ఆయనే మాకు ఆదర్శం
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుపతిలోని బాలికల పర్యవేక్షణా గృహంలో గత ఏడాది ఏడు మంది అనాథ యువతులకు పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా వివాహాలు జరిగాయి.  ప్రస్తుతం కూడా సెప్టెంబర్‌ నెలలో 12 మంది అనా«థ యువతులకు వివాహాలు జరిపించేందుకు నందగోపాల్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వివాహాలు ఘనంగా నిర్వహిస్తాం. పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగతా ఆశ్రమాల వారు కూడా ఇలాంటి సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటాం.
– సంజీవరెడ్డి, ప్రస్తుత పర్యవేక్షణాధికారి 

బాలికను గర్భిణిని చేసిన బాలికల గృహం సూపరింటెండెంట్‌

సీఎంఓ డైరెక్షన్‌.. కలెక్టరేట్‌ యాక్షన్‌ !
Nov 12, 2018, 12:55 IST
 CMO Direction In Girl Pregnancy Case YSR Kadapa - Sakshi
బాలికను గర్భిణిని చేసిన బాలికల గృహం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు

కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్న యంత్రాంగం

బాధితురాలిని ఇతరులెవ్వరూ కలవద్దంటూ ప్రత్యేక ఆంక్షలు

ప్రజాప్రతినిధులు, హక్కుల సంఘాలపై నియంత్రణ

సాక్షి ప్రతినిధి కడప : ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే బాలికల గృహంలో తలదాచుకునే వారికి రక్షణగా నిలవాల్సిన ఆ అధికారి రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భిణిని చేశాడు. ఎట్టకేలకు ఈ ఘటనలో నిందితుడైన బాలికల గృహం సూపరింటెండెంట్‌పై కేసు నమోదు కాగా ఆ కేసును నీరు గార్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని కాపాడే క్రమంలో బాధితురాలైన బాలికను ఎవరూ ఎవరూ కలవొద్దంటూ కలెక్టర్‌ కనుసన్నల్లో ఆంక్షలు విధించారు. నిందితుడికి అధికార టీడీపీతో ఉన్న ప్రత్యక్ష సంబంధాలే అందుకు కారణంగా తెలుస్తోంది.

తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల గృహంలో కడపకు చెందిన ఓ మైనర్‌ బాలిక తలదాచుకుంటోంది. ఆ బాలికపై సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవహారం బహిర్గతం అవుతుందని భావించి తిరుపతి నుంచి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నాడు. సీడబ్ల్యూసీ యంత్రాంగం కడప నగరంలోని ఓ వసతి గృహంలో ఆ బాలికను చేర్పించింది. అంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా అర్ధాంతరంగా బాలిక రక్తస్రావానికి గురైంది. ఊహించని పరిణామంతో హోం నిర్వాహకురాలు జిల్లా అత్యున్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆమేరకు రిమ్స్‌లో చికిత్స చేయించారు. కాగా ఈ విషయమై చిన్నచౌక్‌ పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతికి బదిలీ చేశారు.

సీఎంఓ డైరెక్షన్‌ మేరకే..
బాలికపై లైంగిక దాడి జరిగిన వ్యవహారా>న్ని జిల్లా యంత్రాంగం తొలుత సీరియస్‌గా తీసుకుంది. వైద్య పరీక్షలతోపాటు, బాలిక కథనాన్ని రికార్డు   చేసినట్లు సమాచారం. వెంటనే తిరుపతి హోంలో విధులు నిర్వర్తిస్తూ అందుకు బాధ్యుడైన బి.నందగోపాల్‌పై కేసు కూడా నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత అమరావతిలోని సీఎంఓ వర్గాలు రంగప్రవేశం చేశాయి. ఈ వ్యవహారంలో మిన్నకుండిపోవాలని ఉండిపోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాంతో తిరుపతి హోం బాధ్యుడు నందగోపాల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం తిరుపతికి కేసును బదలాయించారు. పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పైగా బాధితురాలైన బాలికను ఎవ్వరూ కలవరాదంటూ ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయం వెనుక బా«ధితురాలికి మద్దతుగా ఎవ్వరూ ఉండకూడదనే భావన అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నందగోపాల్‌కు అధికార పార్టీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం, ఓ మాజీ ఎమ్మెల్సీ సమీప బంధువు కావడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.


30 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి :మానవహక్కుల వేదిక కన్వీనర్‌ కెజయశ్రీ
 బాధితురాలితో మాట్లాడొద్దని 30 ఏళ్ల అనుభవంలో మొదటిసారి వింటున్నా. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నందగోపాల్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా, బాధితురాలితో ఎవ్వరూ మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించడం ఏమిటి? కలెక్టర్‌ పేరు చెప్పి అడ్డుకోవడం మరీ విడ్డూరం. కలెక్టర్‌కు మెసేజ్‌లు చేసినా స్పందన లేదు, పైగా సీసీ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా నిరుపయోగమే అయింది. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.

మర్మమేమిటో అర్థం కావడం లేదు: ఎమ్మెల్యే అంజద్‌బాషా
లైంగిక దాడికి గురైన బాలికతో మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంలో మర్మమేమిటో అర్థం కావడం లేదని కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. ప్రజాప్రతినిధి అయిన తనను కూడా కలవద్దని ఆంక్షలు విధించారని, సీడబ్ల్యూసీ చైర్మన్‌ శివకామిని స్టేట్‌మెంట్‌ ఆధారంగా తాను మీడియాకు తెలిపానన్నారు. అధికారులు ఈ కేసును ఏం చేయబోతున్నారు? వాస్తవాలను తెలపడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియడం లేదన్నారు. దీని వెనుక ఉన్న వారిని కాపాడి కేసును నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయన్నారు. సంబం«ధిత శాఖ మంత్రి పరిటాల సునీతగాని, జిల్లా కలెక్టర్, ఎస్పీల్లో ఎవరైనా ఇందులో దాగి ఉన్న నిజాలను ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Saturday 10 November 2018

మైనార్టీలకు డబుల్‌ ధమాకా!

మైనార్టీలకు డబుల్‌ ధమాకా!
11-11-2018 02:29:44

ఫరూక్‌కు మంత్రిగా అవకాశం
కీలక ఆరోగ్య శాఖ అప్పగింత?
షరీఫ్‌కు చైర్మన్‌ బాధ్యతలు?
ఇంటి పెద్దను కోల్పోయిన
గిరిజన కుటుంబానికి చోటు
మంత్రివర్గంలోకి శ్రావణ్‌
గిరిజన సంక్షేమ బాధ్యతలు?
నేడు 11.45కు కేబినెట్‌ విస్తరణ
అమరావతి, పాడేరు, కర్నూలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమయింది. టీడీపీకి తొలినుంచీ అండగా ఉన్న మైనారిటీ సామాజికవర్గానికీ, ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికీ, ఎదుగుతున్న నేతను పోగొట్టుకొన్న గిరిజన సామాజికవర్గానికీ ప్రభుత్వంలో పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఎన్‌ఎండీ ఫరూక్‌, దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌లను తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, ఆరోగ్య శాఖలు, కిడారి శ్రావణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించనున్నారు. ఆదివారం ఉదయం 11.45 నిమిషాలకు ఉండవల్లి ప్రజావేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఇద్దరితో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. కాగా, రెండేళ్ల క్రితం ఒకసారి మంత్రివర్గ విస్తరణ జరగ్గా... ఇది రెండో విస్తరణ. మంత్రివర్గ విస్తరణ అంశంపై శనివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కొందరు మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ప్రస్తుతానికి ముస్లిం మైనార్టీ సంక్షేమం సీఎం వద్దే ఉండగా...గిరిజన సంక్షేమం నక్కా ఆనంద్‌బాబు వద్ద ఉంది. ఆ శాఖలను ఫరూక్‌, శ్రావణ్‌కు కేటాయించాలని నిర్ణయించారు.

అదేసమయంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య, ఆరోగ్యశాఖను ఫరూక్‌కు ఇవ్వనున్నారు. అలాగే, శ్రావణ్‌ను రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలపాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం ఫరూక్‌, శ్రావణ్‌లను చంద్రబాబు శనివారం తన నివాసానికి పిలిచి.. మంత్రివర్గంలోకి తీసుకొంటున్న విషయం స్వయంగా తెలిపారు. మంత్రివర్గంలోకి రానున్నందున ఫరూక్‌ శాసనమండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

మైనారిటీలకు మరింత చోటు
ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రిగా తీసుకోవాలని నిర్ణయించడంతో, ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న చర్చ జరిగింది. ‘ముస్లింలకు డబుల్‌ ధమాకా ఇద్దాం’ అని నేతలతో చంద్రబాబు అన్నారు. శాసనమండలి చైర్మన్‌ పదవి కూడా ఆ వర్గానికే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో షరీ్‌ఫకు శాసనమండలి చైర్మన్‌ పదవి దక్కనుంది. మరో మైనారిటీ ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు విప్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా, జియావుద్దీన్‌ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా, మహ్మద్‌ హిదాయత్‌ ఏపీఎంఎ్‌ఫసీ చైర్మన్‌గా, నౌమాన్‌ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. నెల్లూరు మేయర్‌గా అజీజ్‌, ఏలూరు మేయర్‌గా నూర్జహాన్‌ ఉన్నారు. చంద్రబాబు నిర్ణయమే తమకు శిరోఽధార్యమని, అసంతృప్తి ఏమీలేదని జలీల్‌ఖాన్‌, చాంద్‌ బాషా అన్నారు.