Tuesday 24 October 2023

Ramleela has eight of the 15 roles being played by Muslims on stage


 How a Small Town in UP Is Bridging Cultures Through Ramleela

For the past 51 years, the Ramleela in Bakshi Ka Talab has been breaking religious barriers, with Muslim artists playing the role of Lord Rama, Laxman, Sita, Janak, Dasharath, and many others.


How a Small Town in UP Is Bridging Cultures Through Ramleela

Bakshi ka Talab Ramleela troop. Photo: Bakshi ka Talab Ramleela Samiti


Aman

Aman

CULTURESOCIETY













In Bakshi Ka Talab, a small town 30 kilometres away from Lucknow, the call of azaan (an Islamic call to prayer) echoes through the air. It is time for namaz, and Salman Khan bows down with devotion. He completes his prayer and dons his cap.


Interestingly, the adjacent area is abuzz with the rehearsal for Ramleela, where everyone is awaiting Khan’s arrival. Khan plays the role of Lord Rama. He takes the stage to act in a scene where he engages in a conversation with Lord Parashuram. In his opening dialogue, he says, “Shiv dhanush todne wala bhi, Koi Shiv pyaara hi hoga, Jisne aisa apraadh kiya, Wo daas tumhara hi hoga (The one who broke Lord Shiva’s bow, must be someone beloved to Shiva; and for doing such a thing, that devotee must be yours.)


For the past 51 years, the Ramleela in Bakshi Ka Talab has been breaking religious barriers, with Khan playing the role of Lord Rama.


This tradition was started in 1972 by the then gram pradhan, Maikulal Yadav, and his friend, Muzaffar Hussain.


In this Ramleela, Muslims perform various roles such as Lord Rama, Laxman, Sita, Janak, Dasharath, and many others. Just as Khan portrays the character of Lord Ram, Suhail Khan takes on the role of Laxman, while Farhan Ali portrays Sita. Bharat is played by Suhel Khan, and Sher Khan embodies the character of Janak. Even the role of young Ram is portrayed by Abdul Hasan.


Salman Khan has been part of this Ramleela for the last 12 years. And it has been seven years since he has been performing on stage as Lord Rama.



“When I wear the crown and dress as the king of Ayodhya, an aura of devotion envelops the scene. People feel that Lord Rama is physically present before them. Men, women, and children shower flowers and seek blessings by touching my feet. During these moments, people seem to forget my real identity and perceive me as Lord Rama. Experiencing this atmosphere fills me with a profound sense of divine happiness and makes me feel as if I have embodied Lord Shri Ram, a rare feeling, I may not experience elsewhere.”


“If people in a small town like Bakshi ka Talab can coexist with brotherhood and solidarity, why do some individuals attempt to spread hatred across the entire country,“ says Salman Khan, who is a gym trainer.


Twenty-year old Sahil Khan, a student, who plays the role of Laxman, joined the Ramleela when he was nine years old. “When I was a child, this tradition piqued my curiosity. Initially, I had started to play the roles of Bharat, Shatrughan, etc., but as time passed, I started getting more important roles, and eventually got to play the role of Laxman.”


Though he plays the role of Laxman, Sahil holds Lord Ram in unparalleled esteem. “Lord Ram was ‘Maryada Puroshottam’ (embodiment of the ideal man), who did not bat an eyelid before setting off on his 14-year exile in the forest, in pursuance of his father Dasharath’s wish,” he says.



From Right to left – Suhail Khan as Lakshman, Salman Khan as Lord Ram, Sujeet Yadav as Suryadev and Ajay Maurya (side artist). Photo: Bakshi ka Talab Ramleela Samiti


Salman and Sahil together create an atmosphere that unites people in devotion, transcending religious barriers. “Religious tensions between Hindus and Muslims are increasing in the country, but when I am in Bakshi Ka Talab, none of that hatred is perceptible. My family and the audience have been nothing but supportive, showering all their praise and encouragement,” says Sahil Khan.


Thousands of people gather to witness this unique Ramleela. Sanjeev Shukla, 55, a resident of Bakshi Ka Talab, says, “When I was a child, my father used to bring me to watch Ramleela. Now I bring my son to watch it. We feel a great sense of joy that our god is being respected and played by the people from other faiths also.”


The director of this Ramleela is Mohammad Sabir Khan. He has been associated with it in various capacities for 49 years. He started directing Ramleela in 1990. “As a child, I used to watch Ramleela and longed to be part of it. Then I began this journey with the role of Jatayu and gradually started directing it.”



Mohammad Sabir Khan. Photo: Aman Khan


As Sabir Khan shares insights with this scribe, rehearsals are underway. He advises Salman Khan that his facial expressions should reflect Lord Ram’s calm demeanor.


“There was just one occasion when I encountered some objection  to my participation in Ramleela. That was when I got married, and my in-laws raised concerns. I invited them to see our Ramleela first hand, and that became a turning point for them as they watched thousands of people applauding and praising my performance,” he says.


This Ramleela has seen many interesting phases.


Videsh Pal Yadav, son of Maikulal Yadav, who was the founder member of Ramleela organising committee, shares an interesting anecdote. “Once, Ramzaan (the holy month of fasting for Muslims) and Navratra (a Hindu festival) had coincided. We were worried about how we would manage Ramleela because most of our Muslim artists would be observing Roza (fasting),” he recounts.


He said that none of them allowed their fasting to disrupt the smooth flow of the rehearsals.


He added, “On the final day, they [the artists] broke their fast (Iftaar) on the stage itself, just before starting the programme to ensure that there was no interruption in the performance.”


An old connection


In Lucknow, the tradition of a Muslim connection with Ramleela has deep roots. In the 1780s, Lucknow’s fourth nawab, Asaf-ud-Daula, donated 6 acres of land to establish a Ramleela ground in the Aishbagh locality, where the annual Ramleela has been held ever since.


According to Aditya Dwivedi, secretary of the Aishbagh Ramleela Samiti, “This is one of the most renowned Ramleela in India. It was started by Goswami Tulsidas in the 16th century. In the beginning, Sadhus used to perform Ramleela here. However, during the era of the Nawabs, many Nawabs began attending Ramleela, and they were so fond of it that they used to take care of the expenses.”


Even today, many Muslims actively participate in the Aishbagh Ramleela.



Aishbagh Ramleela. Photo: Aman Khan


Syed Shamshur Rahman Naved has been the dance director of the Aishbagh Ramleela since 2006. He is responsible for choreographing the dance sequences throughout the 10-day-long ritual.


During a significant scene portraying the marriage of Lord Ram and Sita, an atmosphere of joy prevails as Sita holds the varmala (garland). In the background, the song ‘Shri Raghubar Komal Kamal Nayan Ko, Pehnaao Jaimaala‘ plays, and as Sita advances with the garland, everyone joins in the celebratory dance. Naved has played a crucial role in teaching the dance steps for this enchanting sequence.



Aishbagh Ramleela. Photo: Aman Khan



Syed Shamshur Rahman Naved giving directions to the Ramleela artists. Photo: Aman Khan


“My Muslim identity has never been an obstacle. The Ramleela Samiti has always been supportive, even in the face of occasional criticism from some who question a Muslim’s participation in a stage performance of a Hindu mythological epic. But such criticism has never posed any hurdle.”


Naved takes pride in his association with the Ramleela performance. “Whenever I step onto any stage, there’s a special announcement for me, and that is a moment of great pride,” he says.


Not only in Lucknow but in Inhauna, a small town in Lucknow’s neighbouring Raebareli district, a Muslim family has been hosting a Ramleela and Dussehra fair for the past 156 years. In 1867, the local talukdar, Chaudhary Sharfuddin, started a Dussehra fair with Ramleela as its central attraction. Today, the sixth generation of Sharfuddin continues the legacy, established by their ancestors. The fair is organised under the patronage of Sharfuddin’s descendants, Chaudhary Wahaj Akhtar and Chaudhary Mohd Shuja.



Inhauna Ramleela. Photo: Chaudhary Mohd Shuja


While members of the Chaudhary family have dispersed across the globe, residing in different parts from Dubai to Mumbai, Delhi to Lucknow, when it comes to Dussehra, they all reunite in Inhauna, regardless of their locations, to celebrate and manage the Dussehra fair and Ramleela, every year.



Inhauna Ramleela. Photo: Aman Khan


“The response to the Dussehra fair is tremendous; it is eagerly awaited, and people count the days throughout the year. Both Hindu and Muslim families attend the fair in large numbers. Even Muslim women, wearing burqas, attend our Ramleela with their families,” says Chaudhary Mohd Shuja, a current scion of this family.


“The idea of organising this fair and Ramleela is nothing extraordinary. It comes naturally to us and is an integral part of our family tradition which is part of the unique ‘Ganga-Jamuni’ culture of this Avadh region. Even this year’s Ramleela has eight of the 15 roles being played by Muslims on stage,” says Mohd Shuja.












Thursday 12 October 2023

Muslim Declaration - Telangana Salim Pasha

 #ఆత్మగౌరవ_పతాక_ముస్లిం_డిక్లరేషన్ ☘️

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు, ముస్లిం సమాజం కూడా బాగుపడుతుందని, జనాభా దామాషా ప్రకారం తమకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతాయని ముస్లింలు ఆశించారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. దానికి విరుగుడుగా రేపు భవిష్యత్తు ఎన్నికలలో ముస్లిం మైనారిటీల రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కారాలు ఏమిటి? రాజకీయ పార్టీలు ముస్లిం సమాజ సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎలాంటి చర్యలు చేపడితే పేద ముస్లింలు బాగుపడతారు? తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ముస్లిం ఆలోచనాపరులుగా, అనేక ధఫాలుగా మాకు మేమే ఒక అంతర్మథనం, మేథోమథనం చేసుకొని ‘ముస్లిం డిక్లరేషన్’ పేరు మీద ఒక డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. ఇలా రూపొందిన ‘తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ 2023’ అనేది ముస్లింల అస్తిత్వ పోరాటంలో ఒక భాగం.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల జీవితాలు బాగుపడతాయని ముస్లింలు నమ్మారు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు కూడా చేశారు. కానీ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు దక్కాల్సినంత సామాజిక న్యాయం దక్కలేదు, సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదు. పైగా రోజురోజుకు ఉన్న కాసింత రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుంది. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరే ముస్లిం ఎమ్మెల్యే, ఒక్కరే ముస్లిం ఎమ్మెల్సీ ఉన్నారు. జిల్లాలలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతున్నది. అందుకే హైదరాబాదు పాతబస్తీ మినహాయించి, జిల్లాలలో ముస్లిం ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న కనీసం 10 నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని డిక్లరేషన్‌లో డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణలో ముస్లింలకు నామినేటేడ్ పదవులలో కూడా అన్యాయమే జరుగుతుంది. గత పదేళ్ల తెలంగాణలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా రాజ్యసభ స్థానం లభించలేదు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో ఒక్క ముస్లిం సభ్యుడు లేడు. రాష్ట్రంలోని 11 స్టేట్ యూనివర్శిటీలకు ఒక్క వైస్ ఛాన్సలర్ కానీ, ఒక్క రిజిస్ట్రార్ కానీ ముస్లిం లేడు. అనేక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల కూర్పులో ముస్లిం అభ్యర్థికి ప్రాతినిధ్యం ఉండటం లేదు. జిల్లా కో ఆప్షన్ సభ్యుల నియామకంలో, జిల్లా గ్రంథాలయ చైర్మన్ల నియామకంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యుల నియామకంలో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ముస్లింలకు న్యాయం లభించడం లేదనడానికి ఇవి ఉదాహరణలు.

 

ప్రస్తుతం దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే వేసిన సుధీర్ కమిషన్ కూడా తన నివేదికలో దాదాపు ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింల పేదరికాన్ని రూపుమాపడానికి ఒక్క ప్రత్యేక పథకం కూడా అమలు కాలేదు. గత పాలకుల లాగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తుంది. ఈ ధోరణి మారాలని తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీగా ప్రశ్నిస్తున్నాం. ప్రతీ పేద ముస్లిం కుటుంబానికి ‘ముస్లిం ఎంపవర్మెంట్ స్కీం’ కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసి, వారి సాధికారతకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

ఇక రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో మైనారిటీ బడ్జెట్ వాటా విషయానికి వస్తే కేటాయింపులు చాలా తక్కువ. మళ్లీ ఇందులో సగం ఖర్చు చేయరు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించినవి రూ.12 వేల కోట్లు అయితే, ఖర్చు పెట్టింది మాత్రం రూ.9 వేల కోట్లు. ఈ అత్తెసరు నిధులతో ముస్లింలలో ఉన్న కడు పేదరికం ఎన్ని వందల ఏళ్ళకు దూరమయ్యేను? అందుకే మైనారిటీల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.10వేల కోట్లు కేటాయించాలని, ఈ నిధులు పూర్తిగా గ్రీన్ ఛానల్‌లో పెట్టి ఖర్చు చేయాలని డిక్లరేషన్‌లో డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన మైనారిటీ గురుకులాలను స్వాగతిస్తున్నాం. కానీ శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించడం లేదు? శాశ్వత టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం ఎందుకు చేపట్టడం లేదు? అని నిలదీస్తున్నాం. ప్రస్తుతం బంగారు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం విద్యార్థినీ విద్యార్థుల కొరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లేదు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి ముస్లిం విద్యార్థినులకు, ఒకటి విద్యార్థుల కోసం మొత్తం 66 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కావాలని అడుగుతున్నాం. మేము చదువుకోవడానికి హాస్టళ్లు కావాలని అడగడం తప్పుకాదు కదా? వీటి ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చు చాలా చిన్నదే. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.

 

సుధీర్ కమిషన్ తన నివేదికలో రాష్ట్రంలోని ముస్లింలలో 75శాతం మంది స్వయం ఉపాధి రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొంది. రోడ్ల పక్కన పండ్ల బండీలు, పంక్చర్ షాపులు, పాన్ షాపులు లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించేది వీరే. వీరికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి భరోసా అందడం లేదు. కరోనా మహమ్మారి తర్వాత వీరి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి వారిని గుర్తించి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.2లక్షలతో కూడిన పూర్తి సబ్సిడీ లోన్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. సుధీర్ కమిషన్ రాష్ట్రంలోని 43శాతం ముస్లిం కుటుంబాలకు సొంత ఇండ్లు లేవని, కిరాయి ఇండ్లలోనే జీవనం గడుపుతున్నారని పేర్కొంది. అందుకే డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో జనాభా దామాషా ప్రకారం 12శాతం ప్రత్యేక కోటా ఇవ్వాలని అడుగుతున్నాం.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు దాదాపు రూ.10లక్షల కోట్లు విలువ చేసే వక్ఫ్ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఈ ఆస్తులు గత ప్రభుత్వాల హయాంలో అన్యాక్రాంతం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్యాక్రాంతం అయిన ఈ వక్ఫ్ భూములను, ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొని వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తామని, కబ్జాకోరులను కఠినంగా అణచివేయడానికి జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ అధికారంలోకి రాగానే ఈ హామీని తుంగలో తొక్కారు. అంతటితో ఆగక గతంలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయని విధంగా హజ్ హౌస్‌లోని వక్ఫ్ ఆస్తుల దస్తావేజులు ఉన్న గదిని సీజ్ చేశారు. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తుల ఒరిజినల్ దస్తావేజులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దీంతో కబ్జా కేసుల్లో వక్ఫ్ ట్రిబ్యునల్‍లో, కింది కోర్టుల్లో గెలిచిన కేసులను, పై కోర్టులలో వక్ఫ్ బోర్డు ఓడిపోతుంది. దీనికి కారణం ఒరిజినల్ దస్తావేజులు కోర్టుకు సమర్పించకపోవడమే. జిల్లాలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక చోట్ల వక్ఫ్ భూములను కబ్జాలు చేశారు. అందుకే ముస్లింలకు వారసత్వంగా వచ్చిన లక్షల కోట్ల వక్ఫ్ ఆస్తులను రక్షించాలని డిక్లరేషన్ ద్వారా అడుగుతున్నాం. వక్ఫ్ బోర్డును కమిషనరేట్ పరిధిలోకి తెచ్చి, జ్యుడీషియల్ పవర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వక్ఫ్ ఆస్తులను సరిగా పరిరక్షించి, వాటి ద్వారా వచ్చే ఆదాయ మార్గాలను పెంచాలని, ఇలా వచ్చిన ఆదాయాన్ని ముస్లింల విద్య, వైద్యం కొరకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేస్తే ప్రభుత్వాల మీద ముస్లింలు ఆధారపడడం తగ్గిపోతుంది. ఇలా ముస్లింల రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో ముడిపడిన మొత్తం 22 డిమాండ్లను ముస్లిం డిక్లరేషన్‌లో పొందుపర్చాము.

 

ఎంతసేపూ మతతత్వ పార్టీలను బూచీగా చూపెట్టి తమను తాము సెక్యులర్‌గా చెప్పుకొనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అయితేనేమీ, ముస్లింల ప్రతినిధి అని చెప్పుకొనే ఎమ్ఐఎమ్ అయితేనేమీ గంపగుత్తగా ముస్లింల ఓట్లు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఎండగట్టడమే ముస్లిం జేఏసీ లక్ష్యం. ముస్లిం సమాజంలోని ఆలోచనాపరుల మనోభావాలను పట్టించుకోకుండా, ముస్లిం పేద వర్గాలకు ఏమీ చేయకుండా, గతంలో‌ లాగా ఈసారి 2023 ఎన్నికలలో కూడా ముస్లింల ఓట్లను గంపగుత్తగా ఎగరేసుకుపోయే చరిత్ర పునరావృతం కావద్దనేదే మా ప్రయత్నం.

 

రాబోయే ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మేము రూపొందించిన 22 డిమాండ్లను అమలుచేస్తామని ప్రకటించాలి. వారి మానిఫెస్టోలో ఈ డిమాండ్లను చేర్చాలి. వీటిని అమలు చేస్తామని హామీ ఇవ్వాలి. లేదా వీటికంటే మెరుగుగా ముస్లింల అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచించి అమలు చేస్తామని భరోసా ఇవ్వాలి. ఇలా చేసిన వారికే ముస్లింల మద్దతు, తెలంగాణ ముస్లిం జేఏసీ మద్దతు!

 

#సయ్యద్_సలీమ్_పాష

కన్వీనర్‌, తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ

Friday 6 October 2023

Poodoori Rajireddy - దుల్లాహి, శిర్క్

 దుల్లాహి, శిర్క్

(ఇటీవల జరిగిన ‘రైటర్స్‌ మీట్‌’ సమావేశంలో ‘ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న’ అన్న అంశం మీద నేను మాట్లాడాల్సి ఉండింది. కానీ అది సజావుగా సాగలేదు. అక్కడ మాట్లాడాలనుకున్నది ఇక్కడ పోస్టు చేస్తున్నా.)

ఒక గ్రీకు తత్వవేత్త ఏమంటాడంటే– మనిషికి గనక గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండివుంటే, దేవుడికి కూడా అదే గుర్రం ముఖం, నాలుగు కాళ్లు ఉండేవి అని! అంటే మనిషి తన రూపంలోనే దేవుడిని సృజించుకున్నాడు. మనుషుల దేవుడు మనిషి రూపంలో ఉంటాడు; చీమలకు కూడా దేవుడు ఉంటే చీమల ఆకారంలో ఉంటాడు కావొచ్చు; ఎవరికి తెలుసు? 

మనకు తెలిసినంతలో అన్ని మతాల దేవుళ్లకు, లేదా వాళ్లు భక్తిగా కొలిచేవాళ్లకు ఒక ఆకారం ఉంది. ఒక ఇస్లాంలోనే దేవుడికి రూపం లేదు అనేది ఒక శాసనంలా ఉంది. దేవుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని హిందూమతపు పుస్తకాల్లో కూడా ఉంటుంది. కానీ హిందూమతం అనేది స్థిరపడినది కాదు; పరిణామం చెందుతూనే ఉండేది కాబట్టి, దాన్ని ఇదీ అని వ్యాఖ్యానించడం కష్టం. ప్రస్తుత రూపంలో ఉన్న హిందూమతంలో అయితే దేవుళ్లకు కచ్చితమైన ఆకృతి ఉంది. ఇస్లాంలో మాత్రమే విగ్రహారాధన లేదు. ఒక హయ్యర్‌ పవర్‌ను రూపరహితంగా ఆరాధించడం అనేది కూడా నాకు మంచి భావనగానే కనబడుతుంది. 

మతం అనేది మన జీవితాల్లో చాలా ప్రధానమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నామకరణం, వివాహం నుంచి, మన జీవితంలో ఉన్న అన్ని వ్యవహారాలు మతం ఆధారంగానే నడుస్తాయి; ఆఖరికి అంత్యక్రియలతో సహా. మతం లేదా దేవుడితో ముడిపడి మనకు ఇంజనీరింగ్‌ వర్ధిల్లింది. కళలు వర్ధిల్లినై. సాహిత్యం వచ్చింది. ఈస్తటిక్‌ సెన్స్‌ వృద్ధి అయింది. మతంతో ముడిపడిన నిర్మాణాల కోసం మనుషులు తమ జీవితాలను ధారపోశారు. ఉదా: సిస్టీన్‌ చాపెల్, ఖురాన్‌ కాలిగ్రఫీ, దేవాలయాల్లోని శిల్పాలు. హ్యూమన్‌ ఎండ్యూరన్స్‌ అనేదానికి మతం  ఒక పరీక్ష. మనకు మనం మతానికి ఎంతగా ఇచ్చేసుకున్నామంటే– ఇంక దేవుడు లేడు అంటే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధం లేనంతగా.

మతం, దేవుడు రెండింటినీ సందర్భాన్ని బట్టి ఒకే అర్థంలో వాడుతున్నాను. ఒక్కో మతంలో దానివైన సమస్యలున్నాయి, దానివైన వివక్షలున్నాయి, దానివైన సానుకూలతలు ఉన్నాయి, దానివైన అతిశయాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు  అప్రస్తుతం. ప్రపంచంలోని అన్ని మతాలు వేరు, ఇస్లాం వేరు అని చెప్పాలన్నది నా ఉద్దేశం. దేవుడిని రూపరహితంగా ఆరాధించడం ఒక్కటే ఇస్లాంను వేరుగా ఉంచడం లేదు. ‘మతేతరుల’ గురించి ఇస్లాం మాత్రమే నొక్కి మాట్లాడుతుంది. అత్యాధునిక మతం కావడం వల్ల కూడా ఇది జరిగివుండొచ్చు. 

ముందుగా ఒకటి చెప్తాను. మనలో ద్వేషం ఎప్పుడూ ఒక ఊహా దయ్యం ఆధారంగా పనిచేస్తుంది. చాలావరకు మన లక్ష్యిత గ్రూపు ఏమిటో తెలియదు కాబట్టే, ఏ అడ్డు లేకుండా వ్యాఖ్యానాలు చేయగలుగుతాం. కానీ దీని ప్రతిఫలనం ఫలానా వాళ్ల మీద ఉంటుంది అని కచ్చితంగా తెలిసినప్పుడు అది మనకు ఒక నియంత్రణ రేఖలా పనిచేస్తుంది. అందుకే నేను నా ముస్లిం స్నేహితులను తలుచుకుంటూ దీన్ని మొదలుపెడుతున్నాను. ఇది ఏ ఒకరిద్దరు ముస్లిం రచయితల గురించో  కాదు. వీరి సాకుగా నాకున్న కన్సెర్న్స్‌ను ముస్లిం కమ్యూనిటీలోని ఆలోచనాపరుల ముందు పెట్టాలన్నది నా ఆలోచన. 

ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొన్నమొన్నటిదాకా హనుమంతుడి వాహనం ఒంటె అని తెలియదు. చిన్నప్పటినుంచీ హనుమంతుడు ఎగురుకుంటూ వెళ్తాడనే తెలుసు. పుట్టుకతో హిందువును అయినప్పటికీ ఇంత చిన్న విషయం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మతాల మీద, మత సాహిత్యం మీద నేనేమీ అథారిటీ కాదు అని ఒప్పుకోవడానికి. ఇంక నేను మాట్లాడుతున్నది పొరుగు మతం గురించి కాబట్టి, నా అవగాహన పరిమితుల మీద నాకు స్పృహ ఉంది. 

‘అల్లాహ్‌ దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ’ మానవజాతి అల్లాహ్‌కు ఇచ్చిన ప్రమాణం(అహ్‌ దుల్లహి) అంటుంది దివ్య ఖుర్‌ఆ¯Œ . ఈ ఒక్క వాక్యం వల్ల ప్రపంచంలోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పినవాళ్లు అవుతున్నారు. ఇంకా ఖురాన్‌ ఏం చెప్తున్నదంటే– అల్లాహ్‌కు సాటిగా ఇంకో దేవుడిని నిలబెట్టడం క్షమించలేని మహాపాపం (శిర్క్‌) అంటుంది. 

ఇస్లాం మొత్తం పునాది ఈ భావనల మీద ఆధారపడి ఉంది. ఈ లెక్కన ఎంతమంది ఈ మహాపాపం చేస్తున్నట్టు? ఎందుకంటే ప్రతి మనిషీ ఏదో ఒక మతంతో అసోసియేట్‌ అయివున్నాడు కదా. అతడు ఆదివారం చర్చీకి పోతుండవచ్చు, గురువారం సాయిబాబా గుడికి పోతుండవచ్చు, కట్ట మైసమ్మకు కొబ్బరికాయ కొట్టివుండొచ్చు. వీళ్లందరూ మహాపాపులే. వాళ్లను ఏం చేయాలి? ధర్మయుద్ధం. ఇదిగో ఇక్కడుంది సమస్యంతా! దీనివల్ల ఇతర మతాల వారి ఉనికి ప్రమాదంలో పడుతోంది.

ముస్లింలలో తార్కిక ఆలోచనలు కలిగినవాళ్లు లేరా? మనుషులు సామరస్యంతో సహజీవనం చేయడమే అత్యుత్తమ విలువ అని వారికి తెలియదా? అత్యధికులు పరమత సహనం ఉన్నవాళ్లు కాబట్టే, శాంతియుతంగా బతకగలుగుతున్నాం. కానీ ఎవరైనా ఈ భావనలను మానవాళికి వ్యతిరేకంగా అన్వయించుకునే వీలు లేదా?

ఇదిలా ఉంటే, మన రచయితలు ముస్లింవాద సాహిత్యం అంటుంటారు. అలాంటప్పుడు ఈ భావనల మీద వీరి వైఖరి ఏమిటి? ఇవన్నీ తెలిసే ముస్లింవాదమా? మెజారిటీవాద రాజకీయాల్లో మా బతుకుల గురించి మేము చెప్పుకుంటున్నాం అని వాళ్లు అనొచ్చు. కానీ ప్రపంచ లెక్కల్లోకి పోతే ఈ వాదం తేలిపోతుంది. హిందుత్వ రాజకీయాలను శత్రువుగా భావిస్తున్నప్పుడు, ఇస్లాం ఛాందసం కూడా ఇంకొకరికి శత్రువుగా ఉంటుందన్న అవగాహన వీరికి ఉందా? ఎందరెందరినో మీరెటువైపు అని నిలదీసిన నేల కదా ఇది! ఇప్పుడు నేను అడుగుతున్నాను. ముస్లిం రచయితలు, మేధావుల్లారా, మీరెటు వైపు? మనం ఏ మతంలో ఉన్నా అందరమూ కలిసిమెలిసి ఉండాలన్న అవగాహన వైపా? లేక, మా మతమే మిన్న, తక్కినవి సున్నా అని మీరు కూడా మనసులో అనుకుంటున్నారా? 

రెండోది మీ అభిప్రాయం అయితే, మీరు హిందుత్వ రాజకీయాలను ప్రశ్నించడంలో అర్థం లేదు. మీ అవగాహన మొదటిదే అయితే, మీ ఇస్లామేతర సహోదరుల కోసం మీరు ఏం చేస్తారు? 

మతాలు తీవ్రరూపం దాలుస్తున్న కాలంలో ఉన్నాం. మనుషులు దేవుడి పేరుతో మృదువుగా కావాల్సింది పోయి, కఠినం అవుతున్నారు. ఎక్స్‌ట్రీమ్స్‌కు పోతున్నారు. మధ్యేమార్గం అనేది లేకుండా పోతోంది. ఎందుకంటే మతం అనేది ఆధ్యాత్మిక సాధన కోసం కాదు. అది ఒక రాజకీయం. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కానీ మనకు డిస్కోర్స్‌ ఎట్లా సెట్‌ అయివుందంటే, నిద్రలేస్తూ పాచిపళ్లతో కూడా హిందుత్వ అని తిట్టొచ్చు. కానీ స్నానం చేసి ఒళ్లంతా దగ్గరగా పెట్టుకుని కూడా ఇస్లాం ఛాందసం గురించి మాట్లాడకూడదు. దీనికి చాలావరకు మన వామపక్ష మేధావులు కారణం. ఎందుకంటే, మన దగ్గర ప్రతి చర్చనూ నడిపేదీ, ఏది ప్రగతిశీలమో, కాదో నిర్ణయించేదీ వాళ్లే. కానీ ఈ విషయంలో వాళ్లు ఉండాల్సినంత ఫెయిర్‌గా లేరని నా అభిప్రాయం. హిందుత్వ అని వామపక్షీయులు మాట్లాడకుండా ఏ దినపత్రిక అయినా ఏ ఒక్క రోజైనా ఉంటుందా? మరి ఇస్లాం ఛాందసం మీద వీళ్లు ఎంత మాట్లాడుతున్నారు? పైగా ఇలాంటి అంశం ఎత్తితే, అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్టాంపు గుద్దడానికి ముందు సొరుగులోంచి ఇంక్‌ ప్యాడ్‌ తీస్తారని కూడా తెలుసు. కానీ మతం ఏదైనా సాటి మనిషితో ఆదరంగా ఉండాలన్నదే నా అభిమతం. మతం అని ఇక్కడ సందర్భవశాత్తూ వాడటమే గానీ, ప్రతి మనిషితోనూ వీలైనంత మంచిగా ఉండాలన్నది నా వ్యక్తిగత సంకల్పం, సాధన!

Ratnaji Nealapuri

Reply

2h

Raghu Seshabhattar

శభాష్ 🌹👍

Reply

2h

Datla Devadanam Raju

మంచి మాటలు చెప్పారు. అక్కడ చెప్పే వీలు లేకుండా పోవడమే మంచిదయ్యింది Poodoori Rajireddy గారూ

Reply

2h

Venkateswaran Rushinarada Subramanya

అక్కడ చెప్పి ఉంటేనే బాగుండేది. సంక్షిప్తమైన వ్యాసం అయినా ముస్లింవాదులు, ముసల్మానులు కూడా ఈ దుల్లాహి, శిర్క్ లపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి.

Reply

2h

Kaanchanapalli Govardhan Raju

మంచి మాటలు, అభినందించకుండా ఉండలేను.

Reply

2h

Prasad Palakurthy

చాలా బాగా రాసారు సార్....

అందరం కల్సి మెల్సి ఉండాలన్నా అవగాహనా ముస్లింవాద రచయితలది,మేధావులది ఐతే చందసావాదా ముస్లిం లలో మార్పు తెచ్చే రచనలు కానీ, ఆహ్ దూల్లాహి, శీర్క్ ను వ్యతిరేకించే రచనలు గాని మీరు చేసారా? మేధావులు మాట్లాడుతున్నారా ? మా మతం లో ఆ అవకాశం లేదు దాడులు చేస్తారు అనే తప్పించుకునే ధోరణి కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ హిందూ చందసవాద చేతుల్లో దాడులకు గురైన చాలా మందిని ఈ సందర్బంగా గుర్తు తెచ్చుకొని సమాధానం ఇస్తే సంతోషం...

Reply

1h

Bp Padala

ముస్లిం వాదం కన్నా వామపక్షేయుల తీవ్ర వాదం ఈ దేశానికి తీరని హాని చేసింది , చేస్తుంది .

You took the bull by horns 👍

Reply

1h

Edited

ఖుర్షీద్ సయ్యద్

Reply

1h

Gudipati Venkat

హనుమాన్ వాహనం ఒంటె అని ఇప్పుడే తెలిసింది. కానీ ఎన్ని ముద్రలు వేస్తారో ఇక రెడీగా వుండండి.

Reply

1h

Sujatha Velpuri

వామ పక్ష వాదులు, వాళ్లకు కనపడేదే ప్రపంచమంతటా ఉందని , ఉండాలని భావిస్తుంటారు. ఇటువైపు వాడు ఏం చెపుతున్నాడో చెవిన వేసుకునేదే లేదు

అయితే నాదొక ప్రశ్న. “అల్లాహ్ దాస్యమే చేయాలని, ఆయనకే విధేయులై ఉండాలని మానవ జాతి అల్లాహ్ కి ఇచ్చిన ప్రమాణం” అనే వాక్యం వల్ల ప్రపంచం లోని 600 కోట్ల మంది ఇచ్చిన మాటను తప్పుతున్నారు”

??

మానవ జాతి అంటే ఇస్లాం లో అర్థం, మానవులందరూ అని అర్థమా లేక ఇస్లాం ని పాటించే వారా?

ఈ లెక్కన మన హిందూ మతంలో కూడా “సకల చరాచర జగత్తు ని పాలించే” వాడిగా , ప్రపంచమంతా ఆయన బిడ్డలు గా విష్ణువుని, జీవులన్నిటి లెక్కలూ చూసే వాడిగా శివుడి ని ఆరాధిస్తాం కదా! మరి ఆ సకల చరాచర జగత్తు , అన్ని జీవుల్లో ముస్లిమ్స్ ఉన్నట్టా లేనట్టా ?

మిగతా మతాలు , మతస్థులు ఉన్నారని తెలిసీ ఖురాన్ ఈ విధంగా జనరలైజ్ చెయ్యదని అనుకుంటున్నాను. చేసినట్లయితే ఆ జనరలైజేషన్ హిందూ మతానికి కూడా వర్తిస్తుంది గా?

ఛాందస వాదం ఎక్కడ ఉన్నా ఖండించ వలసిందే గానీ 80% హిందులున్న దేశంలో , మైనారిటీలు గా ఉన్న ముస్లిమ్స్ తమ గొంతును గట్టిగా వినిపించటంలో, తమ అస్తిత్వ ప్రకటన చేసే క్రమంలో కొంత ఛాందసంగా ధ్వనించటం సహజమేనేమో కదా

మీ నీయత్ మీద సందేహం లేదు . మనుషులంతా సామరస్యంగా ఉండటమే ఎవరమైనా కోరుకునేది

Reply

1h

Edited

Harshaneeyam S

Very measured, balanced,thought provoking , nuanced point of view🙏

Reply

1h

Abdul Rajahussain

  · 

సగం తెలుసు..సగం తెలీదు..వెరసి మీరు

చెప్పదలుచుకున్నది మీరు చెప్పారు.మీ అవగాహన

కో నమస్కారం.ఇలాంటి విద్వేష రచనలు మానుకుంటే మంచిది..వీటివల్ల నిజాలమాటెలావున్న సమాజంలో పెద్ద చిచ్చు పెట్టడమే.ఇతర మతాలను ద్వేషించమనిఖురాన్ లో

ఎక్కడుంది.ఖురాన్ మొత్తం ఆకళింపు చేసుకున్న ముల్లాలా రాశారు.‌మీరెప్పుడైనా ఖురాన్ చదివారా?

మీరచనవల్ల మీరు చదవలేదని అర్ధమవుతుంది.

తెలుగు అనువాదాలు దారుకుతున్నాయి..చదవండి.

మతపరమైన విషయాలు చాలా సున్నితమైనవి

వాటిని గురించి రాసేటప్పుడు సాధికారత అవసరం.

అది మికులేదని వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ వ్యాసమే ఉదాహరణ‌.ఇంకాచాలా వున్నాయి‌.

మీ వ్యాసంలో దోషాలు.‌ముస్లిం రచయితలు

అందరూ ఇస్లాం గురించి,మతం గురించి రాయడం లేదే..

ఒక మతం నుంచి మీకు అప్లాజ్ వస్తుంది.మిమ్మల్ని

మెచ్చుకుంటూకీర్తిస్తారు..అదంతా నిజం కాదు.

జాగ్రత్త..‌.థ్యాంక్యూ..!!

Reply

1h

Ranganadham Gara

బాగా రాశారు. అసలు మతమే మూఢం. మతముల న్నియు మాసిపోవును....

Reply

1h

Abdul Rajahussain

  · 

బేసిగ్గా..మీ ప్రశ్నే తప్పు‌

ముస్లిం రచయితలందరు ఇస్లాం గురించి

రాస్తున్నారా? వాళ్ళేమైనా ముల్లాలా?

మీకెవరు చెప్పారండీ! ముస్లిం రచయితంటే

మతప్రవక్తలా...ఏమిటండి బాబు పిచ్చి మాటలు.

పిడి వాదాలు..అందర్నీ ఒకే గాట కట్టేస్తున్నార

గడ్డం పెంచుకున్నోడల్లా సాయిబు కానట్లే

ముస్లిం రచయితలందరూ మతవాదులు కారు

Reply

58m

Akula Amaraiah

కమ్యూనిస్టులు ఇస్లాం తీవ్రవాదం మీద, ఛాందసం మీద మాట్లాడటం లేదనదేది తప్పు. రెండోది.. కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ వ్యతిరేకులు ఏమి ఆరోపణలు చేస్తున్నారో మీరూ అదే పని చేశారు కాస్తంత కళాత్మకంగా..

మతం ఏదైనా మత్తుమందు లాంటిదని కమ్యూనిస్టులు లేదా మీరనుకున్న వామపక్షీయులు ఆది నుంచి చెబుతూనే వచ్చారు. మీది వ్యక్తిగత సంకల్పం. వారిది వ్యవస్థాగత సంకల్పం. ఈ మాత్రం వాదన చేయడానికి మీరెత్తుకున్న ఎత్తుగడ బాగుంది..

Reply

44m

Viswanath Reddy

చాలా బాగా చెప్పారు రాజిరెడ్డి గారు

Reply

41m

Aditya Korrapati

చాలాసార్లు మతాలు, కనీసం వాటి ఆరంభ దశలో, అన్యమతాలు పాటించే వాళ్ళు ఉంటారు అనే అసంప్షన్ తో ఆపరేట్ చేయవు (మౌనమన్నా పాటిస్తాయి, లేదా తీసి పారేసినట్టు మాట్లాడతాయి, గ్రీక్ ల మతాన్ని క్రైస్తవంలో pagan అన్నట్టు). ఏది చెప్పినా మానవాళి మొత్తానికి జరిగినట్టే, వర్తించినట్టే చెబుతాయి. వాటికి భౌగోళికమైన, సామాజికమైన సరిహద్దులు ఉన్నట్టు గుర్తించవు (అవి నిర్దిష్ట స్థల కాలాల్లో, భౌగోళిక పరిస్థితుల్లో వికసించినప్పటికీ). ప్రతి మతం యూనివర్సల్ క్లైమ్స్ యే చేస్తుంది.

ఇక విశ్వాసులు- అవిశ్వాసులు అనే భావమే ఉంది. ఒక్కొక్క మతంలో దీని తీవ్రత స్థాయిల్లో భేదం కచ్చితంగా ఉంది. ఉదాహరణకి భారతదేశంలో ఒకప్పుడు నాస్తికులు అని దేవుడు లేడనే వారిని కాక వేదాన్ని అంగీకరించని వారిని అన్నారు.

అయితే, ఇస్లాం కూడా స్తబ్ధంగా ఉందని అనుకోడానికి లేదు. Introspection చేసుకుంటూనే ఉంది. గ్రంథాలకి, రోజువారీ అనుష్ఠానానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు చెప్పిన ఛాందసం లేదని తప్పించుకోలేం. అయితే ఛాందసం అంటేనే ఛందస్సు ని అంటే అక్కడ రాసిన/చెప్పిన మాటను పట్టుకు వేలాడేది అని. అంటే లిటరల్ గా చదవడం అని. లిటరల్ గా చదవడం నుంచి బయటపడితేనే కదా సాహిత్యవేత్త అయ్యేది.

ఇంకో అంశం ఏమంటే, బాహాటంగా ఒక వైఖరి తీసుకోవడం అంత సుగమం కాదు, అంతరంగంలో ఏమి అనుకున్నా. Brute force ముందు లాజికల్ మాటలు పని చేయవు.

Reply

34m

Edited

Sreerama Murthy

అన్ని మతాల్లోనూ తీవ్రమైన దుర్మార్గాలు లోపాలు ఉన్నాయి, స్త్రీల విషయంలోనైతే మరీను, ఆర్ ఎస్ ఎస్ అధినేత అయితే వారు ఇంట్లో ఉండి మగవాడికి అనుకూలంగా మెసులుకోడమే మంచిది అంటారు. అఫ్ఘాన్, ఇరాన్ మహిళల బాధల గురించి ముస్లిం రచయితలు పెద్దగా రాయరు. మధ్యలో వామపక్షాలు చేసిన నేరమేమిటి, సమాజం మారాలని ఆశిస్తూ వారు రాసిన రాతలు నినాదప్రాయంగా ఉన్నాయని ముద్ర వేసి సాహిత్యంలో సామాజిక చైతన్యానికే చోటు లేకుండా అనుభూతి వాద దుడ్డుకర్రతో వారిని మోదేశారు. యువ కవులు అమ్మ కవితలు, నాన్న సెంటిమెంట్ల చుట్టూ మౌస్ లు రాపాధించేలా చేశారు. దేశం లో ముస్లిం లు తమ బాధలనుంచి తాము బయటపడలేక చేస్తున్నారు. ఇతర విశ్వాసులను ద్వేషించే తీరిక వారికెక్కడిది. అమెరికా అధునిక సామ్రాజ్యవాదం వారిని ఎన్ని రకాలుగా రక్కి రక్కి నెత్తురోడేలా చేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. ఇరాక్, లిబియా, పాలస్తేనా వంటి ఉదాహరణలెన్నో. తమ దేవుడు మాత్రమే దేవుడు ఇతరులు కారు అనేది అన్ని మతాల్లో ఉన్న జాడ్యమే. ఇస్లాం మీద ఇతరులందరూ పగబట్టినప్పుడు వారు మత ప్రాతిపదిక పై ఏకమై తమకు తోచిన పధ్ధతిలో తిరగబడితే తప్పేముంది? ఇండియాకు సమ్మంధించినంత వరకు ముస్లిం లు మైనారిటీలు, అల్ప సంఖ్యాకులను తమ్ముళ్లను చూసుకున్నట్టు చూసుకోడం మెజారిటీ బాధ్యత. ఆ దృష్టితో వ్యవరించే వామపక్షాలను విమర్శించడం హిందుత్వ వాదులకే చెల్లు

Reply

33m

Ravi Sangeveni

చాలా గొప్పగా.. నిర్మొహమాటంగా చెప్పారు..👌👍💐💐

Reply

29m

Lolaa Ravi Kumar Kosuri

చాలా బాగా రాసిన రైటప్. బహుశా ఇక్కడ కొందరికి నచ్చకపోవచ్చు. కానీ లైక్ మైండెడ్ గుంపుకూడా చాలా మందిమే ఉన్నాం. మీలాగే నేనుకూడా మతం ఏదైనా కానీ రాంగ్ గైడెన్స్ ని ఇవ్వకూడదు. మనిషిలా బతకడం‌నేర్పితే చాలు. లేదా మనిషిని మనిషిలా బతకనిచ్చినా చాలు.

Reply

23m

Vijaya Rama Raju

మతం పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అనే ఇంగితం కరవవుతోంది. స్వంత మతంలో వున్న మురికి కడుక్కోవడం మాని ఇతరులది కడగటం గురించి ఆలోచించడం వల్లే సమస్యలు. అలాగే కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచ వ్యాపితంగా మత ఛాందసత ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పాటు, వాటి ఆధారంగా అధికారంలోకి రావడం సులభమనే అనే ఆలోచనలకు రాజకీయ పార్టీలు వస్తున్నాయి. ప్రతి మతంలోను సంస్కరణ వాదులు, ఛాందస వాసులు ఉంటారు కానీ ఎవరిని encourage చేయాలో కూడా మన ఇంగితమే. మన మతం పేరుతో చేసే దుందుడుకు చర్యల వలన,ఆధునిక ప్రపంచంలో ఇతర దేశాల్లో బతుకుతున్న సామాన్య జనం పరిస్ధితి గురించి అన్ని మతాల వ్యక్తులు ఆలోచించాలి.

Reply

22m

Jeevan Reddy Puduri

రైటర్స్ మీట్ లో ముస్లిం రచయితలకు ఒక ప్రశ్న.. అనే దగ్గరినే సజావుగా సాగలేదు.. అని మీరు పేర్కొన్నారు.. అలాంటప్పుడు ముస్లిం రచయితలను ప్రశ్నించడం సాధ్యమే కాదు. ఆ చర్చలు ఎప్పుడు జరగనివ్వరు కూడా ... మీ వ్యక్తిగతంగా అందరితో కలిసిమెలిసి ఉండటం అయితే...ఖచ్చితంగా హిందుత్వ రాజకీయం చేయడం.. మనతో కలిసిమెలిసి ఉండేవారితో మనం కలిసిమెలిసి ఉండడం.. అనేది నా అభిప్రాయం... పోస్ట్ చాలా బాగుంది బాబాయ్..

Reply

18m

Sadlapalle Chidambara Reddy

చాలా చక్కగా వివరించారు. చెడు వాసన వేసే ప్రతి మతాన్నీ నీలదీయాల్సిందే. కానీ ఇక్కడ మనం ఎంతకు దిగజారామ్ అంటే ఎవరైనా తప్పుచేస్తే దాని ఆధారంగా స్పందించ కుండా.... కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని,.... వెతికి తప్పుతో సంబంధం లేకుండా వెనకేసుకు రావడం పెద్ద రిగంగా తయారయ్యింది. చీకటి యుగం నుంచి ఎన్నో పరీక్షలలో రాటు తేలి 21 వ శతాబ్ధికి వచ్చినా ఇంకా మంద బుద్ధి పోలేదు. సొంత ఆలోచనల వ్యక్తిగా విశ్వ మానవునిగా ఎదగడానికి ఇంకా ఎంత సమయం కావాలో??????

Reply

3m