Wednesday, 15 April 2026

Gajwa - E - Hind - Vijayawada

 ఇండియాను ఇస్లామిక్ స్టేట్ గా మారుస్తాం. విజయవాడ కేసు 


విజయవాడలో బయటపడిన ఉగ్రవాద లింకుల కేసు (Vijayawada Terror Links Case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా (Islamic State) మార్చడమే లక్ష్యంగా కొందరు యువకులు విదేశీ హ్యాండ్లర్ల ప్రేరేపణతో జిహాదీ కార్యకలాపాలకు సిద్ధమైనట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. 

ETV Bharat

ETV Bharat

 +3

ఈ కేసులోని కీలక అంశాలు:

నిందితుల లక్ష్యం: దేశంలో ఇస్లామిక్ రాజ్యం స్థాపించడం, 'గజ్వా-ఏ-హింద్' (భారత్‌పై యుద్ధం) నిర్వహించడం నిందితుల ప్రధాన లక్ష్యమని పోలీసు విచారణలో తేలింది.

ముఖ్య సూత్రధారి: విజయవాడకు చెందిన మహమ్మద్‌ రహమతుల్లా షరీఫ్‌ను విదేశీ హ్యాండ్లర్లు ప్రేరేపించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఈ కేసులో 12 మందికి పైగా నిందితులు ఉన్నట్లు FIR నమోదైంది.

ఐసిస్ (ISIS) & అల్-ఖైదా లింకులు: నిందితులు ISIS మరియు AQIS (అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది.

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం: ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ ప్రచార వీడియోలను విస్తృతంగా షేర్ చేయడం చేస్తున్నారు.

పేలుడు పదార్థాల తయారీ: పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో (IEDs) ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడంతో పాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు.

విధ్వంసక ప్రణాళికలు: జాతీయ జెండాను అవమానించడం, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో తుపాకులు సమకూర్చుకుని, జిహాదీ శిక్షణ కోసం పాకిస్థాన్ లేదా ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు నిందితులు అంగీకరించారు. 

ETV Bharat

ETV Bharat

 +5

విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక, మరియు ఇతర రాష్ట్రాల నుంచి నిందితులను అరెస్టు చేసిన అధికారులు, ఈ కేసులో విదేశీ నిధుల (Foreign Funding) కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

ETV Bharat

ETV Bharat

 +1

దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ ...

14 Apr 2026 — భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం 'గజ్వా-ఏ-హింద్' (భారత్‌పై యుద్ధం) ప్రారంభించామని విజయవాడ ఉగ్రలింక...



AP7AM

విదేశీ హ్యాండ్లర్ ప్రేరేపణతో జిహాదీ వైపు ఆకర్షణ - దర్యాప్తులో ...

26 Mar 2026 — Vijayawada Terrorist Link Case Updates : భారతదేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన మహమ్మద్‌ రహమతుల్లా ష...



ETV Bharat

భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యం : విచారణలో నిందితులు

14 Apr 2026 — విజయవాడ ఇస్లామిక్ ఉగ్రలింకుల కేసు దర్యాప్తులో అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. విచారణలో భాగంగా ఆరుగురు నిందితులను వేర్వేరు...


దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

Vijayawada Terror Case Islamic State Conspiracy Uncovered
  • భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకే 'గజ్వా-ఏ-హింద్' కుట్ర
  • విజయవాడ ఉగ్ర కేసులో నిందితుల విచారణలో సంచలన విషయాల వెల్లడి
  • సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఆఫ్ఘ‌న్ మాస్టర్‌మైండ్
  • దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌పై దృష్టి.. రంగంలోకి ఎన్‌ఐఏ
భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం 'గజ్వా-ఏ-హింద్' (భారత్‌పై యుద్ధం) ప్రారంభించామని విజయవాడ ఉగ్రలింకుల కేసులో అరెస్టయిన నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఈ మార్గాన్ని తమకు ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన అల్ హకీం షుకూర్ చూపించాడని వారు పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం.

పోలీసుల విచారణలో నిందితులు మరిన్ని కీలక వివరాలు వెల్లడించారు. "భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలని, 'ఏ నేషన్ లెడ్ బై మహమ్మద్ విల్ నాట్ సరెండర్' వంటి నినాదాలతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు ప్రయత్నించాం. ఇస్లాంను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశాం. జిహాద్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని షుకూర్ మాకు అప్పగించాడు. దేశంలోని స్లీపర్‌ సెల్స్‌తో త్వరలో పరిచయం చేస్తానని చెప్పాడు. కానీ, అంతలోనే మేం అరెస్టయ్యాం. ఇప్పటివరకు మేం అతన్ని చూడలేదు, ఎక్కడుంటాడో కూడా మాకు తెలియదు" అని నిందితులు చెప్పినట్లు తెలిసింది.

దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్
సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, పాకిస్థాన్, ఆఫ్ఘ‌నిస్థాన్‌లకు పంపి మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని అల్ హకీం షుకూర్ కుట్ర పన్నాడు. ఇందుకోసం 'బెన్ ఎక్స్ డాట్ కామ్' పేరుతో సోషల్ గ్రూపును ఏర్పాటు చేసి, దేశంలోని పలు రాష్ట్రాల యువతకు గాలం వేశాడు. ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గత నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్‌లను అరెస్టు చేయడంతో ఈ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.

వీరిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం, బళ్లారికి చెందిన అబ్దుల్ సలామ్, పాట్నాకు చెందిన షాద్మాన్ దిల్‌ఖ్‌ష సహా ఏడు రాష్ట్రాల్లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఏపీ సీఐడీ అధికారులు షాద్మాన్ దిల్‌ఖ్‌షతో పాటు మరో ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో సోమవారం వారిని కోర్టులో హాజరుపరిచి, రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ విచారణలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ లింకులు ఉన్నట్లు, కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలను అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి 25 నుంచి 40 వరకు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు కనుగొన్నారు.

రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ
ఈ కేసు తీవ్రత దృష్ట్యా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏపీ పోలీసులకు సహకారం అందిస్తున్న ఎన్‌ఐఏ, త్వరలోనే ఈ కేసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.



భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం!

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:58 AM

‘భారత దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అందుకే గజ్వా-ఏ-హింద్‌(భారత్‌పై యుద్ధం) మొదలు పెట్టాం. ఆల్‌ ఖైదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌(ఏక్యూఐఎస్‌), ఐఎస్‌తో సంబంధాలు కొనసాగించాం.

భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం!

అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘భారత దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాలన్నదే మా లక్ష్యం. అందుకే గజ్వా-ఏ-హింద్‌(భారత్‌పై యుద్ధం) మొదలు పెట్టాం. ఆల్‌ ఖైదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌(ఏక్యూఐఎస్‌), ఐఎస్‌తో సంబంధాలు కొనసాగించాం. ఆ దారి మాకు చూపించింది అల్‌ హకీం షుకూర్‌’ అని విజయవాడ ఉగ్రలింకుల కేసులో అరెస్టైన నిందితులు పోలీసు కస్టడీలో వెల్లడించినట్లు తెలిసింది. వారు సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం. ‘ఈ దేశ జాతీయ జెండా స్థానంలో ఐసిస్‌ జెండా పెట్టడం, ఏ నేషన్‌ లెడ్‌ బై మహమ్మద్‌ విల్‌ నాట్‌ సరెండర్‌ అని పెట్టి ఓ వర్గం యువతలో భావజాలాన్ని నింపే ప్రయత్నం చేశాం. ఇస్లామ్‌ను విశ్వసించని వారిపై సోషల్‌ మీడియా ద్వారా విషం చిమ్మాం. షుకూర్‌ జీహాద్‌ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించే పని మాకప్పగించాడు. త్వరలో దేశంలో ఉన్న స్లీపర్‌ సెల్స్‌తో కలిపిస్తానని చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ కలవాలో చెబుతానన్నాడు. అంతలోనే అరెస్టయ్యాం. మేం అతన్ని ఇప్పటి వరకూ చూడలేదు. ఎక్కడుంటాడో మాకు తెలీదు’ అని వారు చెప్పినట్లు తెలిసింది.


యువతే లక్ష్యంగా...

సోషల్‌ మీడియా ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించి, వారిని పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌లకు పంపించి మిలిటెంట్‌ శిక్షణ ఇప్పించేందుకు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అల్‌ హకీం షుకూర్‌ కుట్ర పన్నాడు. మన దేశంలో పలు రాష్ట్రాల యువకులకు గేలం వేశాడు. పలు రాష్ట్రాల్లోని ఓ వర్గం యువతతో బెన్‌ ఎక్స్‌ డాట్‌ కామ్‌ పేరుతో సోషల్‌ గ్రూపు ఏర్పాటు చేయించి జీహాదీ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు. దేశ వ్యతిరేక చర్యలపై నిఘా పెట్టిన ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు విజయవాడలోని వించిపేట, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు యువకుల్ని గత నెలాఖరులో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో వర్కర్‌గా పనిచేసే మహమ్మద్‌ డాని‌ష్ ఏ2), బైకు నడిపించే మహమ్మద్‌ రహంతుల్లా షరీఫ్(ఏ1), హోటల్లో క్యాషియర్‌గా పనిచేసే మీర్జా సోహైల్‌ బేగ్‌(ఏ3)ను అరెస్టు చేసి విచారించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌ వెలుగులోకి వచ్చింది. ఏ డు రాష్ట్రాల్లో 11 మంది ఉగ్రచర్యలకు పాల్పడుతున్న ట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఇళ్లల్లో వంట చేస్తూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్న సైదా బేగం(ఏ5), బళ్లారిలో సొంత లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్న అబ్దుల్‌ సలామ్‌(ఏ11), పట్నాలో నీట్‌కు సిద్ధమవుతున్నషాద్మాన్‌ దిల్‌ ఖ్‌షను అరెస్టు చేశారు. విజయవాడ కోర్టు అనుమతితో ఏపీ సీఐ సెల్‌ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. వీరిచ్చిన సమాచారంతో ఒక మైనర్‌ సహా మరి కొందరిని అరెస్టు చేశారు. కస్టడీలో కీలక సమాచారాన్ని వెలికి తీశారు. షాద్మాన్‌ దిల్‌ఖ్‌ష(ఏ4), లక్మీ అహ్మద్‌(ఏ7), జిషన్‌ అబ్దుల్‌ మజీద్‌(ఏ9), మీర్‌ ఆసిఫ్‌ అలీ(ఏ10), షారూక్‌ ఖాన్‌(ఏ12), ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌(ఏ13)లను ఈ నెల 9 నుంచి సోమవారం వరకూ విచారించారు. కస్టడీ ముగియడంతో సోమవారం ారిని చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారులు.. మరో 4 రాష్ట్రాల్లో ఈ ఉగ్ర లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలు సేకరించారు. అందులో పలువురికి 25 నుంచి 40 వరకూ వివిధ పేర్లతో సోషల్‌ మీడియాలో ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.


రంగంలోకి ఎన్‌ఐఏ

ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ పోలీసులకు సహకారం అందిస్తూ వచ్చిన ఎన్‌ఐఏ.. కేసును పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Apr 14 , 2026 | 07:00 AM











No comments:

Post a Comment